Taxation Changes In India : స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకూ టాక్స్ విధానాలు చాలా సార్లు మారుతూ వచ్చాయి. 1990 దశకం తరువాత మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ పన్ను విధానంలో వచ్చిన మార్పులు ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

New Update
Taxation Changes In India :  స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. 

Taxation Changes : ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ఉండదు. దీనికి బదులుగా ఓట్ ఆన్ ఎకౌంట్(Vote On Account) అంటే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. బీజేపీ(BJP) ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో ఓట్ ఆన్ ఎకౌంట్.. అలాగే నిర్మలా సీతారామన్ తీసుకురానున్న మొదటి మధ్యంతర బడ్జెట్ ఈ ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో అసలు స్వాతంత్య్రం వచ్చాకా.. ఇప్పటివరకూ ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టారు? ఇప్పటివరకూ బడ్జెట్స్ లో పన్ను విధానం ఎలా మారుతూ వచ్చింది వివరంగా తెలుసుకుందాం. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, భారతదేశంలో 91 బడ్జెట్లు పార్లమెంట్ లో సమర్పించారు.  వాటిలో 14 మధ్యంతర బడ్జెట్లు. ఈ సంవత్సరం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన మొదటి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇలా చేయబోతున్న  మొదటి మహిళా ఆర్థిక మంత్రి కూడా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 

దేశంలో పన్ను విధానం ఎలా మారింది?
Taxation Changes in India : భారతదేశం తన రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న ఆమోదించింది.  1947లో స్వాతంత్య్రం పొందిన సుమారు 2.5 సంవత్సరాల తర్వాత, ఇది 26 జనవరి 1950 నుంచి అమలులోకి వచ్చింది. దీని తరువాత, భారతదేశం సార్వభౌమ గణతంత్రంగా మారింది.  దాని స్వంత బడ్జెట్ అలాగే పన్ను వ్యవస్థను రూపొందించడం ప్రారంభించింది. కాలంతో పాటు టాక్స్ విషయంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి...

  • స్వతంత్ర భారతదేశంలో మొదటి పన్ను స్లాబ్ మార్పు 1949-50 దశాబ్దంలో జరిగింది. అప్పుడు రూ.10,000 ఆదాయంపై పన్నును అణాలో నాలుగో వంతుకు తగ్గించారు. ఆ కాలంలో, ఒక రూపాయిని 16 'అణాలు'గా విభజించారు. ఆ సమయంలో 1 రూపాయి నాణెం నిజమైన వెండితో తయారు అయ్యేది. 
  • దీని తరువాత, 1974-75 కాలంలో ఆదాయపు పన్నులో పెద్ద మార్పు కనిపించింది. అప్పుడు ఆదాయంలో అన్ని స్థాయిలలో పన్నులు తగ్గిచారు.  ₹6000 వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది. ప్రతి వర్గం ఆదాయంపై సర్‌చార్జి పరిమితి ఏకరీతి 10%కి తగ్గించారు.  ₹70,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయంపై ఉపాంత పన్ను అంటే మార్జినల్ టాక్స్(Marginal Tax)  70 శాతంగా ఉంది. అయితే అత్యధిక మార్జినల్ టాక్స్  రేటు 75%కి తగ్గించారు.  ఈ మార్పులకు ముందు, దేశంలో అత్యధిక మార్జినల్ టాక్స్  రేటు 97.75 శాతం. అయితే ఈ ఏడాది ఆస్తిపన్ను పెంచారు.
  • ఆ తర్వాత 1985-86 కాలం వచ్చింది నుంచి అప్పటి దేశ ఆర్థిక మంత్రి వి.పి.సింగ్ 8 శ్లాబుల ఆదాయపు పన్నును 4కి తగ్గించారు. ఆ తర్వాత దేశంలో ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని 61.87% నుంచి 50%కి తగ్గించారు. అయితే ₹ 18000 వరకు ఆదాయం పన్ను రహితంగా చేశారు.  దీని తర్వాత రూ.18,001 నుంచి రూ.25,000 వరకు ఆదాయంపై పన్నును 25 శాతానికి పెంచారు. అదే సమయంలో రూ.25,001 నుంచి రూ.50,000 వరకు ఆదాయంపై 30%, రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 40%, రూ.లక్షకు పైగా ఆదాయంపై 50% పన్ను చెల్లించాల్సి వచ్చింది.

మన్మోహన్ సింగ్ తెచ్చిన పన్ను వ్యవస్థ..
మనకు బాగా తెలిసిన ఆదాయపు పన్ను వ్యవస్థను 1992-93 కాలంలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రూపొందించారు. ఆదాయపు పన్ను శ్లాబును 4 నుంచి 3కి తగ్గించారు. 30,000 వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ఉంచారు. రూ.50,000 వరకు ఆదాయంపై 20%, రూ.50,000 నుంచి రూ.లక్ష ఆదాయంపై 30%, రూ.లక్ష పైబడిన ఆదాయంపై 40% పన్ను విధించారు.

Also Read:  భారతదేశపు అత్యంత సంపన్నుడు అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి.. 

Taxation Changes in India : రెండేళ్ల తర్వాత 1994-95లో మన్మోహన్ సింగ్ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేసినప్పటికీ పన్ను రేట్లను మార్చలేదు. ఉదాహరణకు, రూ. 35,000 వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంది. 35 నుంచి 60 వేల వరకు పన్ను 20 శాతానికి పెరిగింది. రెండో శ్లాబు పరిమితి రూ.1.20 లక్షలకు పెరిగింది. 1.20 లక్షలకు పైబడిన ఆదాయంపై 40% పన్ను విధించడం ప్రారంభించింది.

పి.చిదంబరం ‘డ్రీమ్‌ బడ్జెట్‌’..
Taxation Changes in India : 1997-98 ఆర్థిక సంవత్సరంలో పి.చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యారు. అనంతరం ఆయన ‘డ్రీమ్ బడ్జెట్’ను సమర్పించారు. ఆయన 10, 20 నుంచి 30% సాధారణ పన్ను రేట్లను ప్రవేశపెట్టారు. 40,000 వరకు ఆదాయపు పన్ను రహితం, రూ. 60,000 వరకు 10%, రూ. 1.5 లక్షల వరకు 20%, అంతకు మించి 30% పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ప్రతి కేటగిరీలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.20,000కి పెంచారు. అంటే, ఒకరి మొత్తం వార్షిక ఆదాయం రూ. 40,000 అయితే, స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత అది రూ. 20,000 అవుతుంది. అక్కడ అది పన్ను రహితంగా ఉంటుంది. అదే సమయంలో, సంవత్సరానికి ₹ 75,000 సంపాదించే అటువంటి ఉద్యోగులు కూడా పన్ను నుంచి మినహాయింపు పొందారు.  

ప్రణబ్ ముఖర్జీ తీసుకు వచ్చిన విధానం..
Taxation Changes in India : పి.చిదంబరం నిష్క్రమణ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆదాయపు పన్నులో పెద్దగా మార్పులు లేవు. నిజానికి 2005-06 బడ్జెట్‌లో ఆయన మళ్లీ ఆర్థిక మంత్రి అయ్యారు. ఆ తర్వాత లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశారు.  అయితే రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిపై అత్యధికంగా 30% పన్ను రేటును ఉంచారు. సుమారు 5 సంవత్సరాల తర్వాత, ప్రణబ్ ముఖర్జీ పన్ను స్లాబ్‌లో మార్పులు చేశారు అక్కడి నుంచి పన్ను రహిత ఆదాయ పరిమితి రూ. 1.6 లక్షలుగా మారింది. 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై అధిక పన్ను విధించడం ప్రారంభించారు. 

పెద్ద మార్పులు చేసిన అరుణ్ జైట్లీ..
Taxation Changes in India : దీని తర్వాత 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అరుణ్ జైట్లీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ లభించింది. ఆయన సంపద పన్నును తొలగించి, 2% సర్‌ఛార్జ్ విధించడం ప్రారంభించారు. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న సూపర్ రిచ్ వ్యక్తులపై ఇది విధించారు.  ఆ తర్వాత 2017-18లో రూ.2.5 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది. 5 లక్షల వరకు ఆదాయానికి సంబంధించి కొత్త పన్ను రేటును 10% నుంచి 5%కి తగ్గించారు. దీంతో ఆదాయపు పన్ను చట్టంలోని రాయితీ విధానాన్ని మార్చారు. దీని వల్ల రూ.3 లక్షల వరకు ప్రజల ఆదాయం పన్ను రహితమైంది.

నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం..
Taxation Changes in India : మన్మోహన్ సింగ్(Manmohan Singh) తర్వాత, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ పన్నుల వ్యవస్థలో పెను మార్పులు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో, ఆమె  'కొత్త పన్ను విధానం' బ్లూప్రింట్‌ను సమర్పించారు. దీంతో పన్ను విధానం సరళీకృతమైంది. పన్ను రేట్లు తగ్గించారు. ఆదాయపు పన్నులో లభించే దాదాపు అన్ని మినహాయింపులను తొలగించడం ద్వారా, ప్రజలకు సులభమైన శ్లాబ్ సృష్టించారు.  గతేడాది ఈ పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చారు.

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు