Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే!

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు, పసుపు ఎక్కువగా తీసుకున్న జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

New Update
Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే!

Turmeric: పసుపును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పసుపును సరైన ఆహారంతో మాత్రమే తీసుకోవాలని, లేకుంటే అందులోని ఔషధ గుణాలు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. పసుపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కొందరు నీళ్లలో పసుపు కలుపుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతారు. అదేవిధంగా కొందరు పసుపును పాలలో కలిపి తాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలలో పసుపు చేర్చడం ఆరోగ్యానికి మంచిది కాదు.

పాల ఉత్పత్తులు:

  • పాలు, పెరుగులో చాలా మంది పసుపు కలుపుతారు. అయితే, క్యాల్షియం ఉన్న పాల ఉత్పత్తులకు పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే పాల ఉత్పత్తులలో కాల్షియం ఉంటుంది. ఇది కర్కుమిన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఐరన్‌ ఉన్న ఆహారం:

  • ఐరన్ మన శరీరానికి అవసరమైన పోషకం. ఐరన్‌ ఉంటేనే రక్తహీనత వంటి వ్యాధులు దరిచేరవు. అయితే ఐరన్ ఉన్న ఆహారంలో పసుపు వేయకూడదని అంటున్నారు. ఎందుకంటే ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల్లో పసుపును కలుపుకుంటే పసుపులోని కర్కుమిన్ శరీరంలోకి చేరకుండా చేస్తుంది. కాబట్టి బచ్చలికూర, ఉసిరి వంటి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు అందులో పసుపు వేయకుండా చూసుకోవాలి.

మిరియాలు:

  • కొందరు పాలలో పసుపు, మిరియాలు కలుపుతారు. మిరియాలలో పెప్పరైన్ అనే పదార్ధం కర్కుమిన్‌ను మన శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

వీటిలో పసుపు కలపకూడదు:

  • కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పసుపు కలపడం వల్ల శరీరానికి ఉపయోగం ఉండదు. అలాగే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పసుపు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఇలా తీసుకుంటే మంచిది:

  • చిటికెడు పసుపును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగవచ్చు. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అన్నంలో పసుపు వేసి వండుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఏ వయసులో చెవులు కుట్టించాలి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment