RCB vs Punjab: టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీ బ్యాటింగ్
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. జట్టు కూడా ఇదే ఆలోచిస్తోంది. మరి స్టార్ బ్యాటర్ పద్ధెనిమిదేళ్ళ కల తీరుతుందా?
స్టార్ క్రికెటర్ విరాట్కి బిగ్ షాక్ తగిలింది. కస్తూర్బా రోడ్డులో ఉన్న కోహ్లీ వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లో ధూమపానం చేసే వారికోసం ప్రత్యేక స్థలం లేదని గుర్తించి మేనేజర్తో పాటు ఇతర సిబ్బందిపై కేసు ఫైల్ చేశారు.
విరాట్ కోహ్లీ ఒక్క లైక్ తో నటి అవనీత్ కౌర్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు పెరగడంపై హీరోయిన్ రకుల్ స్పందించారు. మనం ఎంత ఖాళీగా ఉన్నామో.. దీని బట్టే అర్థమవుతుంది. ఎంతో విలువైన సమయాన్ని సోషల్ మీడియాలో వెస్ట్ చేస్తున్నాము.. ఇది అనవరసరం అని స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలుస్తాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు.
దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్కు ఈ అవార్డు ఇచ్చారు.
కోల్కతా, బెంగళూరు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. ఒకవేళ బెంగళూరులో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ కొత్త సారథికి మొగ్గుచూపడంతో కోహ్లీ టెస్టులనుంచి వైదొలిగినట్లు సమాచారం.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను కోహ్లీ, అనుష్క శర్మ తీసుకున్నారు.