Dasara Holidays : దసరా సెలవులు వచ్చేశాయి..మొత్తం ఎన్ని రోజులో తెలుసా!
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్లలో వినాయక నిమజ్జనం జరగనుంది. దీనిలో ప్రజలు లక్షల్లో పాల్గొననున్నారు. అందుకే ఆరోజున అందరికీ సెలవును అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన వారికి ప్రాధాన్యత కింద మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల ఇల్లు నేలమట్టం అయినట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
హీరో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించారని 'జనం కోసం' అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ దీనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.
గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె.రాఘవేందర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు, నారాయణమూర్తి తదితరులను నియమించారు.
రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
పాఠ్యపుస్తకాల్లో అధికారిక మార్పులపై నిర్లక్ష్యం వహించిన విద్యాశాఖ అధికారులపై తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. డైరెక్టర్ రాధారెడ్డి, శ్రీనివాసచారిలపై బదిలీ వేటు వేసింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి వీరిద్దరినీ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలు మరిన్ని పరీక్షలు చేయించుకునేలా తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్, అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.