Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సస్పెండ్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను రాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్ రావుతో కలిసి వీళ్లు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.