🔴Operation Sindoor Live Updates: ఆపరేషన్ సిందూర్ - లైవ్
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావారాలపై మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి.
CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆపరేషన్ సిందూర్, మాక్డ్రిల్పై చర్చించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు సీఎం.
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ ఆర్మీ అధికారులు సంచలన ప్రకటన చేశారు. పాక్, పీఓకేలలో ఉత్తరంలోని సవాయ్ నాలా నుంచి దక్షిణాన బహవల్పూర్ వరకు 21 ప్రసిద్ధ శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. అందులో భారత్ 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.