Hyderabad: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం.. మంటల్లో మూడంతస్థుల భవనం
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్ దేవరపల్లి మూడంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో వారిని కాపాడారు.
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్ దేవరపల్లి మూడంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో వారిని కాపాడారు.
హైదరాబాద్లోని చార్మినార్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరగ్గా 17 మంది మృతి చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్ పోటీల్లో మిస్ వరల్డ్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం జరిగింది. డెలీవరీ బాయ్ నజీమ్పై దుండగులు దాడి చేశారు. బ్లేడ్లతో కోసి, కళ్లల్లో స్ప్రే కొట్టి డబ్బులు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. గంజాయ్ బ్యాచ్ దాడి చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్,హరీశ్,ఈటలె రాజేందర్ లకు క్లీన్ చీట్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది.
ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతి రోజూ గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. వర్షిణిని కలిపించాలంటూ రచ్చ రచ్చ చేస్తుందట ఆఘోరీ. ఇక జైలులోనూ అఘోరీ పూజలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్లో ఓ రాసలీల బాగోతం సంచలనం రేపింది. బంజారాహిల్స్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్న ఇఫ్తికార్ ఆహ్మద్.. ఓనర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫొటో, వీడియోలు చూపించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ లైన్లు మొత్తం భూగర్భంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ టవర్లు, పోల్స్, తీగలు అక్కడ కనిపించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. GMHC పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్నారు.