KTR : ఆరు నెలల్లో తిరుగుబాటు తప్పదు : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆరునెలల్లో ప్రజలు తిరగబడక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆరునెలల్లో ప్రజలు తిరగబడక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి సరైన స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలోనే 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. అయితే.. తమకు కూడా ఇలానే ఇవ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకుని సాయం పొందని వారు కోరుతున్నారు.
ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను మరో సారి నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 5 గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్న సమయంలోనే సర్వేను నిర్వహించి వివరాలు సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మొదటగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 12 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది.
సంగారెడ్డి బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి కొన్ని రోజులే అవుతోందని.. ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం దివ్యాంగురాలు రజినీకి ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జాబ్ గ్యారెంటీ ఫైల్ పై సంతకం చేయనున్నారు. ఇప్పటికే రజినీకి ఆహ్వానం అందించినట్లు సమాచారం.