ఏం బతుకురాయ్యా మీది...చిన్న దేశం కూడా ఛీ కొడుతోంది..!!
భారత్ బాటలోనే నేపాల్ కూడా చైనాకు గట్టి షాకిచ్చింది. నేపాల్ కూడా టిక్ టాక్ ను నిషేధించింది. ప్రచండ మంత్రివర్గ సమావేశంలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత్ బాటలోనే నేపాల్ కూడా చైనాకు గట్టి షాకిచ్చింది. నేపాల్ కూడా టిక్ టాక్ ను నిషేధించింది. ప్రచండ మంత్రివర్గ సమావేశంలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. మఖ్యంగా భారత్, చైనాలాంటి దేశాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రమాదం. దీని మీద ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం వర్రీ అవ్వక్కర్లేదు అని చెబుతోంది. భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని అంటోంది.
హైబ్రిడ్ పంటలు వచ్చిన తర్వాత మార్కెట్లో రకరకాల పండ్లు వస్తున్నాయి. వాటిల్లో హెల్త్ బెనిఫిట్లతో పాటు అధిక ప్రోటీన్స్ కూడా ఆ పండ్లు ఇస్తూ ఉంటాయి. సీజనల్ ప్రకారమే మార్కెట్లో పండ్లు ఉంటాయి.. కానీ..ఈ బ్లాక్ యాపిల్స్ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల పండ్లు రంగు మారుతున్నాయి.
చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది.లీ దాదాపు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసి విశేష సేవలు అందించారు. గురువారం లీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.
చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం.
ఆసియా గేమ్స్ లో షూటర్లు విజృంభిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ భారత్ ఖాతాలో స్వర్ణాల లెక్క పెంచుతున్నారు. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా పురుషులకు స్వర్ణం వస్తే...10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో అమ్మాయిల జట్టు రజతాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు టెన్నిస్ ఈవెంట్లో పరుషుల డబుల్ విభాగంలో భారత జోడి సాకేత్- రామ్ కుమార్ జోడీ ఫైనల్లో చైనా ఆటగాళ్ళతో తలపడి ఓడిపోయారు. దీంతో భారత్ టెన్నిస్ జోడీకి సిల్వర్ మెడల్ వచ్చింది.