BREAKING: జుక్కల్, అందోల్, నల్గొండలో కాంగ్రెస్ గెలుపు
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పోలింగ్ అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పదోవ పట్టించడానికి ఫేక్ సర్వేలు వస్తుంటాయని విమర్శించారు.
తెలంగాణ పోలింగ్పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖ రాశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్రెడ్డి.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.