Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్

పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం రాజకీయ గొడవలకు దారి తీయకూడదని కోర్టు అభిప్రాయపడింది.

New Update
Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. దీని వల్ల అక్కడి ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లాక్ డౌన్ ఇవ్వాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది దేశ అత్యున్నత న్యాస్థానం సుప్రీంకోర్టు. పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, హరియాణా రాష్ట్రాలు పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే దీని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మీద కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ పొల్యూషన్ రాజకీయ యుద్ధానికి దారి తీయకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read:ఇంత అవమానమా..మరీ ఇంతలా దిగజారాలా-ఏంజెలో మాథ్యూస్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ ఏటా ఇదొక ఇష్యూ కాకూడదని కోర్టు కోరింది. అలాగే ఢిల్లీ ప్రభత్వానికి కొన్న ఇసూచనలు కూడా చేసింది. బస్సులు కూడా ఎయిర్ పొల్యూషన్ కు కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని తగ్గించాలని చెప్పింది. అలాగే ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వ్యర్ధాలు కాల్చకుండా చూడాలని ఆదేశించింది. తరువాత దీని మీద విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.

దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ కాలుష్యం వలన ఢిల్లీలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వాలు మారిన కాలుష్యం నియంత్రించడంలో మాత్రం అన్నీ విఫలమైయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టిన గాలి నాణ్యత మాత్రం పెరగడం లేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత పడిపోవడంతో అక్కడి ఆప్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి వాహన రేషన్ విధానాన్ని పునఃప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే

ఇవాళ చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ vs ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. కోహ్లీ మరో మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు.

New Update
virat Kohli rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ 42వ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ రికార్డు అందుకునే ఛాన్స్ ఉంది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

టాస్ గెలిచిన ఆర్ఆర్

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్  జరుగుతోంది.  ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్  లో రాజస్థాన్  కీలక ఆటగాడు సంజూ ఆడటం లేదు. కాగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్ లు జరగగా..  16 సార్లు ఆర్సీబీ గెలువగా..  14 సార్లు రాజస్థాన్ గెలిచింది. 

జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

virat-kohli | IPL 2025 | virat-kohli-records | rcb-vs-rr | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment