సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది.

New Update
సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు

సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. స్టాలిన్ మాటలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా చాలా మంది మండిపడ్డారు. చివరకు ఇవి సుప్రీంకోర్టు వరకూ వెళ్ళాయి. ఉదయనిధి మీద చర్యలు తీసుకోవాలంటూ అత్యున్నత న్యాస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. దీన్ని విచారణ చేసిన కోర్టు ఈ రోజు తమిళనాడు మంత్రికి నోటీసులను జారీ చేసింది.ఉదయనిధితో పాటూ ఏ.రాజా, మరో 14 మందికి ఈ నోటీసులను పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటూ తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు.

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో పోల్చారు ఉదయనిధి స్టాలిన్. ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకించి ఊరుకుంటే సరిపోదని...వేళ్ళతో నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. అక్కడితో ఊరుకోలేదు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కూడా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్టాలిన్ మరోసారి చెప్పారు. తాను అన్నది అక్షరాల నిజమని...వాటిని వెనక్కు తీసుకోనని ఆయన ప్రకటించారు. మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం నశించాలంటే...సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందే అన్నారు. అప్పుడే అంటరాని తనం పూర్తిగా పోతుందని స్పష్టం చేశారు. సనాతన ధర్మం వల్లనే అంటరాని తనం వచ్చిందని....ఈ రెండు కవల పిల్లలని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సనాతనం ధర్మం నశిస్తే అంటరానితనం స్వయంచాలకం అవుతుందని చెప్పారు.

ఉదయనిధి వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని లేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై మండిపడింది. స్టాలిన్ ను అరెస్ట్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతని చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు. ఇందులో మాజీ జడ్జిలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మరోవైపు మద్రాసు హైకోర్టు కూడా ఈ విషయం మీద స్పందించింది. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషంగా మారకూడదని సూచించింది. ముఖ్యంగా మతానికి సంబంధించి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని...ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరముందని చెప్పింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment