తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలొస్తాయంటున్న పరిశోధకులు

ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌గా ఉండటం కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని కొంచెం చేసినా కూడా ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో వెల్లడైందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

New Update
Health Tips : ఒక్కో అడుగు ఆరోగ్యానికి ముందడుగు.. రోజుకు కనీసం ఎన్ని అడుగులు వేయాలంటే!

చాలామంది బరువు తగ్గడం కోసం, ఫిట్‌నెస్‌,ఆరోగ్యం కోసం వర్క్‌ఔట్‌లు చేస్తుంటారు. వాకింగ్‌లు, జాగింగ్‌లు, వ్యాయమాలు ఇలా తెగ చేసేస్తుంటారు. అయితే తాజాగా ఓ పరిశోధనల్లో ఇందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. శాస్త్రవేత్తలు కూడా కొంచెం వ్యాయామం చేసిన సరిపోతుందని వెల్లడించారు. మొన్నటిదాకా రోజుకు పది వేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అని అనుకున్నారు. కానీ అన్ని అడుగులు కూడా అవసరం లేదని తమ పరిశోధనల్లో తెలిసిందంటూ చెప్పారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలని పొందొచ్చని.. అది ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తెలిసింది.

Also Read: ఈ తెల్లటి పువ్వులతో…హైబీపీ ఈజీగా తగ్గిపోతుంది..!!

అలాగే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా దాదాపు 60 శాతం తగ్గుతుందని వెల్లడైంది. ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకోసం సుమారు లక్ష​ మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేశామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా 10 వేల అడుగులు అవసరమని చెబుతారు. అయితే ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని చెబుతున్నారు. కేవలం 2700 అడుగులు.. అంటే ఓ రెండు కిలోమీటర్లు నడిచినా కూడా వివిధ గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచిన వారిలో కూడా మంచి ఫలితాలే కనిపించాయి. కానీ కొందరు ఎక్కువ నడిస్తే మంచిదనుకొని బలవంతంగా నడుస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదని.. రోజుకు 2 కి.మీ నడవండని, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే చాలని వీటివల్ల చాలా రుగ్మతల నుంచి బయటపడతారని అంటున్నారు పరిశోధకులు.

Also Read: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..!

అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఉండదని పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. తక్కువగా వ్యాయామం చేసిన మంచి ఫలితాలు వస్తాయని..భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే.. అదే సమయంలో ఎక్కువగా చేసేవారికి కూడా ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉండటంతో పాటు..మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. వాస్తవానికి 10 వేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చిందని.. టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా 10 వేల అడుగుల లక్ష్యాన్ని పెట్టుకుందని తెలిపారు. కానీ శాస్త్రీయంగా ఇది ఎక్కడా కూడా నిరూపితం కాలేదన్నారు. కేవలం ఈ నెంబర్ ఫిగర్‌ను అందరూ గుర్తుంచుకోవాలని ఇలా పెట్టినట్లు తెలిపారు. అందుకే ప్రతిరోజూ తక్కువ వ్యాయామం సుమారు రెండు కి.మీ నడిచిన కూడా ఫిట్‌నెస్‌గా ఉండగలమని చెబుతున్నారు. అలాగే సమయానికి తినడం, కంటి నిండ నిద్రపోవడం లాంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగుంటోందని.. ఇతర సమస్యలు కూడా రావడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment