IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్‌హెచ్!

ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

New Update
IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్‌హెచ్!

SRH : ఐపీఎల్ (IPL 2024) చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు (Worst Record) మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

చెత్త రికార్డ్ చెన్నై పేరిట..
ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డ్ చెన్నై పేరిట ఉంది. కోల్‌కతా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2013 ఫైనల్లో పూనే 125/9 స్కోర్ చేసి ఓటమిపాలైంది. ఐపీఎల్ 2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్ 129/8 చేయగా.. రైజింగ్ పూణే 128/6 పరుగులే చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఇవే అత్యల్ప స్కోర్లుగా ఉండగా ఇప్పుడు ఈ జాబితాలో సన్‌రైజర్స్ చేరింది.

నిప్పులు చెరిగిన కేకేఆర్ బౌలర్స్..
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ స్టార్ పేసర్స్ మిచెల్ స్టార్క్(2/14), హర్షిత్ రాణా(2/14) నిప్పులు చెరగడంతో.. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20)‌, ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24)లు మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(2), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9), హెన్రీచ్ క్లాసెన్(16) ఎయిడెన్ మార్క్‌రమ్(20), నితీష్ కుమార్ రెడ్డి(13), షెహ్‌బాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4), జయదేవ్ ఉనాద్కత్(4) దారుణంగా విఫలమయ్యారు.

Also Read : నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment