Rohit Sharma : వేటు వేశారా.. లక్నోతో మ్యాచ్లో రోహిత్‌ ఎందుకు ఆడలేదు?

ముంబై మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి బంతి తగలడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు తెలిపాయి. కానీ నిజంగా అదే కారణమా, లేక రోహిత్‌పై వేటు వేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
rohit mi match

rohit mi match

వరుస ఓటములతో ఐపీఎల్ లో ముంబై జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోయింది.  కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు తీసినా, ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడినా జట్టుకు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడలేదు.  మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడట్లేదని టాస్ సమయంలో హార్దిక్ తెలిపాడు.  

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

సోషల్ మీడియాలో చర్చ

అయితే సోషల్ మీడియాలో మాత్రం రోహిత్‌ను ముంబై డ్రాప్ చేసిందంటూ చర్చ నడుస్తోంది. డ్రాప్డ్ అన్న హాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జట్టుకు ఐదు కప్‌లు అందించిన ఆటగాడిని డ్రాప్ చేయడమేంటంటూ రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా..మరోవైపు ఫామ్‌లో లేని రోహిత్‌ను డ్రాప్ చేసినా తప్పేంలేదంటూ ముంబై జట్టు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. రోహిత్ శర్మను పక్కన పెట్టారా లేదా అన్నది తెలియాలంటే తర్వాతి మ్యాచ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈ సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో రోహిత్‌ వరుసగా 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

Also read: Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.

New Update
ipl

PBK VS CSK

చెన్నై కథ ఇక ముగినట్లే. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆప్స్ ఆశలు మూసుకుపోయినట్టే. ఈరోజు పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ తో బరిలోకి దిగిన  చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్‌ కాన్వే  49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. తరువా శివమ్‌ దూబె  27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42, రచిన్‌ రవీంద్ర  23 బంతుల్లో 6 ఫోర్లతో 36, ధోనీ  12 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి రాణించారు. అయితే నిర్ణీ ఓవర్లలో టర్గెట్ ను మాత్రం చేరుకోలేకపోయారు.  పంజాబ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, మాక్స్‌వెల్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చెన్నైకి ఇది వరుసగా ఇది నాలుగో ఓటమి.

ప్రియాంశ్ ఆర్య సెంచరీ..

అంతకు ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్‌ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు. ముల్లనూర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సార‌థి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | csk | match | punjab 

Also Read: Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment