Tamim Iqbal: తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే?

ఇటవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కోలుకుంటున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు అతడు కఠినమైన డైట్‌ను ఫాలో అవ్వాలని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు.

New Update
Tamim Iqbal discharged

Tamim Iqbal discharged

Tamim Iqbal discharged

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తాజాగా అతడు హాస్పిటల్ నుంచి కోలుకున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ.. తమీమ్ సాధారణ స్థితికి రావడానికి అతడు తన జీవనశైలి మార్చుకోవాలని అని అన్నారు. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

అంతేకాకుండా కఠినమైన డైట్‌ను అనుసరించాల్సి ఉంటుందని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు. అదే సమయంలో హెల్త్ మినిస్టర్ అబు జాఫర్ మాట్లాడారు. తమీమ్ గ్రౌండ్‌లోకి తిరిగి రావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా స్మోకింగ్ మానుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

ఏం జరిగింది?

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా అతడు సోమవారం మ్యాచ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తమీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈసీజీ, తదితర స్కానింగ్స్‌ చేయించారు. అయితే తమిమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

తమిమ్‌కు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్‌ మెడికల్‌ అధికారి దేబాశిస్ చౌదరి అన్నారు. అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. అయితే తమిమ్‌ను మొదటగా ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అతని ఆరోగ్య పరిస్థితి వల్ల స్థానిక ఆస్పత్రికే తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

ఇదిలాఉండగా తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ టీమ్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 మ్యాచుల్లో ఆడాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 15 వేల కన్నా ఎక్కువగా పరుగులు చేశాడు. తమిమ్‌కు గుండెపోటు రావడంతో క్రికెట్‌ అభిమానులు షాకైపోయారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.   

( tamim-iqbal | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment