Champions Trophy: ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొదటి సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఇందులో మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించాలంటే మన స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించాల్సిందే. అందరికంటే ముఖ్యంగా మహ్మద్ షమి తన ప్రతాపం చూపించాలి. 

New Update
Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్‌ కామెంట్స్!

Mohammed Shami

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మంచి రసవత్తరంగా జరగాల్సిందే. కొన్నేళ్ళ నుంచి ఇరు జట్ల మధ్యనా మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. అయితే ఎక్కువసార్లు విజయం ఆసీస్ సొంతమౌతోంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో మన చేతిలో నుంచి ట్రోఫీని లాక్కెళ్ళిపోయింది కంగారూల జట్టు. తరువాత జరిగిన మ్యాచ్ లు కూడా ఇందుకు తగ్గట్టుగానే జరిగాయి. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైన్లస్ మ్యాచ్ కోసం కూడా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో గెలిచిన వారు ఫైనల్స్ కు చేరుకుంటారు. 

స్పిన్నర్ల మీద ప్రెషర్...

ఛాంపియన్స్ ట్రోపీలో ఆస్ట్రేలియా, ఇండియా రెండూ బలమైన జట్లుగా ఉన్నాయి. అందులోనూ ఆసీస్ బ్యాటర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ట్రావిడ్ హెడ్ అయితే క్రీజులో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అందరికంటే ఇతడిని నిలువరించడం భారత బౌలర్ల తక్షణ కర్తవ్యం. దుబాయ్ పిచ్ లు మొదటి నుంచి స్పిన్నర్లుకు బాగా అనుకూలిస్తున్నాయి. దాంతో ఇప్పుడు భారం అంతా వారిపైనే పడింది. ఈ క్రమంలో భారత ముఖ్య స్పిన్నర్ అయిన షమి మీద హైప్రెషర్ ఉంది. అందుకే టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షమికి సలహాలు ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ అంటే ఉన్న భయాన్ని ముందు మైండ్ లో నుంచి తీసేయాలని సూచించాడు. సాధ్యమైనంత తొందరగా అతణ్ణి అవుట్ చేయాలని...ఆ తర్వాత మ్యాక్స్ వెల్‌, జోష్‌ ఇంగ్లిస్‌ లాంటి హిట్టర్లకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా బౌలింగ్ చేయాలని హెచ్చరించాడు భజ్జీ. టీమ్ ఇండియా ఇప్పటి వరకు ెలా అయితే స్ట్రాంగ్ గా ఆడుతూ వస్తోందో...అలాగే ఆడాలని సూచించాడు. ఇద ి నాకౌట్ మ్యాచ్ అని..అతిగా ఏమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదని చెప్పాడు. 

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ .. రివేంజ్కు టీమిండియా ప్లాన్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్ పోస్ట్!

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు.

New Update
dhoni thaman

dhoni thaman

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.  

ఉర్రూతలూగించిన ధోనీ 

అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా  18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

#telugu-news #sports #Chennai Super Kings #punjab-kings #PBKS vs CSK
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు