Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.

New Update
Yuzvendra Chahal - RJ Mahvash

Yuzvendra Chahal - RJ Mahvash Photograph


టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రేడియో జాకీ మహ్‌వశ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. అది వైరల్‌గా మారడంతో రచ్చ మొదలైంది. ఆమె పెట్టిన పోస్టు మామూలుది అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. తన మ్యారేజ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

‘హస్బెండ్’ పోస్టు

అందులోనూ ఆ వీడియోపై చాహల్ లైక్ చేయడంతో ఫ్యాన్స్ తమ కామెంట్లతో హోరెత్తించారు. ఇటీవల మహ్‌వశ్ ఒక ‘హస్బెండ్’ వీడియో పంచుకున్నారు. ‘‘ నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో.. అతడే ఏకైక వ్యక్తి అవుతాడు. అతడే నాకు స్నేహితుడు.. అతడే నా ప్రియుడు.. అతడే నా భర్త.. నా జీవితం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అవసరం లేని వ్యక్తులు నాకు వద్దు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ఆ సమయంలో ఇతర అబ్బాయిలతో నేను మాట్లాడలేను’’ అని ఒక వీడియో షేర్ చేసింది. అది విపరీతంగా వైరల్ అయింది. అయితే మహ్‌వశ్ ఆ వీడియోను చాహల్ కోసమే పెట్టిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దీంతో చాహల్, మహ్‌వశ్ రూమర్స్ రిలేషన్స్ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇవి ఎక్కడివరకు సాగుతాయో చూడాలి. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఇదిలా ఉంటే గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్, మహ్‌వశ్ కలిసి స్టేడియంలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. చాహల్ తన మాజీ భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వడం, ఆ తర్వాత మహ్‌వశ్‌తో కలిసి స్టేడియంలో దర్శనమివ్వడంతో అంతా షాక్ అయిపోయారు. ప్రస్తుతం చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

(yuzvendra-chahal | RJ Mahvash | latest-telugu-news | telugu-news)

#telugu-news #latest-telugu-news #RJ Mahvash #yuzvendra-chahal
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రి...

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment