/rtv/media/media_files/2025/03/26/c2ht3fl3Mzm9A9YZ9rhT.jpg)
గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో 150 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను ఏడో ఓవర్ నాలుగో బంతికి రషీద్ ఖాన్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. రషీద్ తన 122వ మ్యాచ్లో 150వ వికెట్ను చేరుకున్నాడు.
🚨 MILESTONE ALERT 🚨
— the_cricket_web (@the_cricket_web) March 25, 2025
Rashid Khan completed 1️⃣5️⃣0️⃣ wickets in TATA IPL!@gujarat_titans @IPL #RashidKhan #TATAIPL2025 #GujaratTitans pic.twitter.com/Sfsaf7QACT
లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడవ బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచాడు. మలింగ 105 మ్యాచ్ల్లో 150 వికెట్లు పడగొట్టగా, చాహల్ 118 మ్యాచ్ల్లో ఈ రికార్డును సాధించాడు. రషీద్ ఖాన్ తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 124 మ్యాచ్ల్లో 150 వికెట్లు సాధించాడు. డ్వేన్ బ్రావో 137 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించగా, భువనేశ్వర్ కుమార్ 138 మ్యాచ్ల్లో తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్ లో ఉండగా.. రషీద్ ఖాన్ 11వ స్థానంలో ఉన్నాడు.
11 పరుగుల తేడాతో విజయం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ కొట్టింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) పరుగులు చేశారు. చివర్లో రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో గుజరాత్ ఆటగాళ్లు తడబడ్డారు. చివరికి పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also read : యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్