Ashwin: పంత్ అలా చేస్తే నా పేరు మార్చుకుంటా.. అశ్విన్ సవాల్!

రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ ఆశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెటర్లలో అతని డిఫెన్స్‌ అద్భుతమని పొగిడేశాడు. డిఫెన్స్‌ ఆడుతూ పంత్ ఒక్కసారైన ఔటైనట్లు చూపిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు. 

New Update
ashwin pant

R Ashwin praises on Rishabh Pant

Ashwin: భారత ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ ఆశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ఆడకపోయినా అతని ప్రతిభ అద్భుతమని పొగిడేశాడు. ప్రపంచంలోనే పంత్ అత్యుత్తమ డిఫెన్సివ్‌ టెక్నిక్‌ కలిగిన ప్లేయర్‌ అంటూ పొగిడేశాడు. ఈ మేరకు రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన అశ్విన్.. పంత్‌ ఎప్పుడు ఏం చేయాలనేది సరైన పద్ధతిలో చెబితే చాలు పని కానిచ్చేస్తాడని చెప్పాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. కానీ కొందరిలా ఫేలవంగా పర్యటనను ముగించలేదన్నాడు. 

పంత్‌ సామర్థ్యం ఇంకా బటయపడలేదు..

'పంత్ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు చాలా టైమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. పంత్‌ సామర్థ్యం ఇంకా బటయపడలేదు. అన్ని రకాల షాట్లను ఆడగల సత్తా ఉంది. స్వీప్, రివర్స్‌ స్వీప్, స్లాగ్‌ స్వీప్, అప్పర్ కట్ అన్ని ఆడేస్తాడు. ఇవి హై రిస్క్‌ షాట్లే. పంత్ డిఫెన్స్ మోడ్‌లో 200 బంతులు ఎదుర్కొంటే సెంచరీ కొట్టగలడు. ఎప్పుడు ఎటాకింగ్‌కు వెళ్లాలి.. ఎప్పుడు డిఫెన్స్‌ ఆడాలనేది పంత్ కు బాగా తెలుసు. సిడ్నీ టెస్టులో పంత్ రెండు రకాల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 40 పరుగులు రాబట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ కొట్టేశాడు. తొలి ఇన్నింగ్స్‌ గురించి అందరు మరిచిపోయి పొగిడేశారు' అని అశ్విన్ అన్నాడు. 

ఇది కూడా చదవండి: Rythu Bharosa: వారికే రైతు భరోసా ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ఇక విమర్శకులు పంత్ దూకుడును అర్థం చేసుకోవాలని సూచించాడు. పంత్ డిఫెన్స్‌ను తక్కువగా అంచనా వేయకూడదని, ప్రస్తుత క్రికెటర్లలో అతని డిఫెన్స్‌ అద్భుతమన్నాడు. ఏ బౌలర్‌ వేస్తున్నా ప్రశాంతంగా ఆడటం అతని స్పెషాలిటీ అని, పంత్ ఎదుర్కొన్న 10 బాల్స్ లో డిఫెన్స్‌ ఆడుతూ ఒక్కసారి ఔటైన సందర్భం చూపిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు. 

ఇది కూడా చదవండి: TTD: క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment