బాబార్ ఆజమ్‌కు దిమ్మతిరిగే షాక్...  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!

న్యూజిలాండ్‌తో  జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు బాబార్ ను కూడా బోర్డు పక్కనపెట్టింది. జట్టులో ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి.  

New Update
babar azam big shock

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. త్వరలో న్యూజిలాండ్‌తో  జరగబోయే ఐదు మ్యాచ్ లటీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి అతని స్థానంలో  సల్మాన్ అలీ అఘాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.  ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను కూడా బోర్డు పక్కనపెట్టింది. పాక్ లో కీలక ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి.  

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ దారుణమైన ప్రదర్శన తర్వాత, ఆకిబ్ జావేద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రెండు ప్రధాన టోర్నమెంట్‌లను దృష్టిలో ఉంచుకుని యువ టీ20 జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది.  వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని బోర్టు స్పష్టం చేసింది. ఇక వన్డే జట్టులో షాహీన్ అఫ్రిది చోటు లభించకపోగా..  పొట్టి ఫార్మాట్‌లో అవకాశం లభించింది. గత ఏడాది చివర్లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సల్మాన్ పాకిస్తాన్‌ను 2-1 తేడాతో గెలిపించాడు. కాగా మార్చి 16 నుండి పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో ఐదు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది.  ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

టీ20, వన్టే జట్లు ఇవే!  

టీ20 జట్టు: హసన్ నవాజ్, ఒమైర్ యూసుఫ్, మహ్మద్ హరీస్ అబ్దుల్ సమద్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ నియాజీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్ అబ్బాస్ అఫ్రిది, జహందాద్ ఖాన్, మహ్మద్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, సుఫియాన్, ఎ.

వన్డే జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, ఇర్ఫాన్ షాహిర్, తాబ్ నియాజీ, తాబ్ నియాజీ, నసీమ్.

మార్చి 16 – మొదటి టీ20, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
మార్చి 18 – రెండవ టీ20, యూనివర్సిటీ ఓవల్, డునెడిన్
మార్చి 21 - మూడవ టీ20, ఈడెన్ పార్క్, ఆక్లాండ్
మార్చి 23 - నాల్గవ టీ20, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
మార్చి 26 – ఐదవ టీ20, స్కై స్టేడియం, వెల్లింగ్టన్
మార్చి 29 – మొదటి వన్డే, మెక్లీన్ పార్క్, నేపియర్
ఏప్రిల్ 2 – రెండవ వన్డే, సెడాన్ పార్క్, హామిల్టన్
ఏప్రిల్ 5 - మూడవ వన్డే, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి

Also read :  Shama Mohamed : అప్పుడు  తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC vs RR : అదరగొట్టిన ఢిల్లీ .. రాజస్థాన్ టార్గెట్ 189

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, ఓపెనర్ అభిషేక్ పొరెల్ (49)టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (38) పరుగులతొ రాణించారు.

New Update
dc-vs-rr match

dc-vs-rr match

ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు జేక్ ఫ్రేజర్  (9), అభిషేక్ పొరెల్(49)  మంచి శుభారంభాన్ని అందించారు. అభిషేక్ పొరెల్ దూకుడుగా జట్టు స్కోరు బోర్డును పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 4, 6, 4, 4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

 ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌

34 పరుగుల వద్ద  ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ ఔట్  అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్‌ నాయర్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  కేఎల్ రాహుల్(38) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు పొరెల్. అయితే 97 పరుగుల వద్ద  కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ  కాసేపటికే అభిషేక్ పొరెల్ కూడా ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

అనంతరం స్టబ్స్ (34), అక్షర్ (34) ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు.  హసరంగ వేసిన 16 ఓవర్లో అక్షర్ పటేల్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా వీరి జోడీని తీక్షణ విడదీశాడు. చివర్లో స్టబ్స్, అశుతోష్ శర్మ(11) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్‌ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisment
Advertisment
Advertisment