Ind Vs Pak: స్టేడియంలో మంత్రాలు చేసిన పాక్ కెప్టెన్.. ఏకి పారేసిన సురేష్ రైనా.. వీడియో వైరల్!

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆ సమయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ‘తస్బీహ్’తో ప్రార్థన చేస్తూ కనిపించాడు. అతడి చర్యపై సురేష్ రైనా స్పందించి రోహిత్‌శర్మ కూడా ప్రార్థన చేస్తున్నాడని సరదగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

New Update
Mohammad Rizwan

Mohammad Rizwan Photograph: (Mohammad Rizwan)

ఆదివారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. పాక్ నిర్ధేశించిన 241 పరుగులను భారత్ సులభంగా ఛేదించింది. 6 వికెట్లు మిగిలి ఉండగానే హై-వోల్టేజ్ మ్యాచ్ విజయవంతమైంది. ఇక అందరూ ఊహించినట్లుగానే మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది.

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

తస్బీహ్‌తో రిజ్వాన్ 

అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. అతడు మ్యాచ్ సమయంలో ‘తస్బీహ్’ (ప్రార్థన పూసలు)తో కనిపించాడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. అతడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రార్థనా పూసలతో అదృష్టం మారాలని ప్రార్థిస్తూ కనిపించాడు. కానీ అది జరగలేదు. 

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

అయితే రిజ్వాన్ చర్య నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటికే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా సరదగా రిజ్వాన్ చర్యను ఎగతాళి చేసాడు. రిజ్వాన్ తస్బీహ్ లెక్కిస్తున్నట్లు టీవీ స్క్రీన్‌లో మెరిసాడు. దీంతో రైనా సరదాగా, “రోహిత్ శర్మ భీ మహామృత్యుంజయ్ మంత్ర పధ్ రహే హోంగే (రోహిత్ శర్మ కూడా మహామృత్యుంజయ్ మంత్రం జపించేవాడు)” అని సరదగా చెప్పుకొచ్చాడు.

Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..

ఇకపోతే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడాడు. ‘‘ఈ పిచ్‌లో 280 పరుగులు మంచి స్కోరు అని మేము భావించాము. మిడిల్ ఓవర్లలో భారత్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి మా వికెట్లను పడగొట్టారు. నేను, సౌద్ షకీల్ కాస్త మెల్లగా ఆడాలని సమయం తీసుకున్నాము. వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అందుకే మేము 240 పరుగులకు కుదించబడ్డాము’’ అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ

ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో ఛేదించింది. 

New Update
ipl

RCB VS DC

విరాట్ కోహ్లీ మళ్ళీ గర్జించాడు. యంగ్ స్లేయర్ కృనాల్ విజృంభించాడు. దీంతో ఢిల్లీ చేతులెత్తేసింది. ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే నాలుగు స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కృనాల్ విజృంభించేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. కృనాల్‌ పాండ్య (73*), విరాట్‌ కోహ్లీ (51) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని..

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్‌ పోరెల్‌, డుప్లెసిస్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పోరెల్‌ (28) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్‌ (4) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్‌ (22) ఔట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.

today-latest-news-in-telugu | IPL 2025 | dc vs rcb | match 

Also Read: India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

Advertisment
Advertisment
Advertisment