Tanmay Srivastava: అప్పుడు అండర్ 19 ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్‌

మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు.

New Update
Tanmay Srivastava

Tanmay Srivastava Photograph: (Tanmay Srivastava)

Tanmay Srivastava: క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ కీలక పాత్ర పోషిస్తాడు. మ్యాచ్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాడు. అయితే మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా నిర్వహించనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ తెలిపింది. ఐపీఎల్‌లో ఆడిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

విరాట్‌ కోహ్లీతో అండర్ 19లో ఆడి..

విరాట్ కోహ్లీతో అండర్ 19 లో రాణించాడు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.  శ్రీవాస్తవ ఉత్తర ప్రదేశ్ తరఫున,  ఐపీఎల్ 2008, 2009 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దానితో తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపీఎల్ 2025లో అంపైర్‌గా వ్యవహరించనున్నాడు.

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

అతను ఐపీఎల్‌లో ఆటగాడిగా ఆడి, ఇప్పుడు అంపైర్‌గా మారిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానం వీడాలనుకోడని, ఇక్కడ అతడి పాత్ర మాత్రమే మారిందని తెలుపుతూ.. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్‌ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చింది.

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్ పోస్ట్!

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు.

New Update
dhoni thaman

dhoni thaman

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.  

ఉర్రూతలూగించిన ధోనీ 

అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా  18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

#telugu-news #sports #Chennai Super Kings #punjab-kings #PBKS vs CSK
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు