Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్​ సత్తాను చాటి చెప్పిందన్నారు. ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపారు.

New Update
revanth india

revanth india Photograph: (revanth india)

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్ గా భారత్​ సత్తాను చాటి చెప్పిందన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

టీమిండియా విన్నింగ్‌పై దేశ ప్రధాని మోదీ టీమిండియా జట్టును ప్రశంసిస్తూ విషెష్ తెలిపారు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు క్రికెట్ జట్టుకు గర్వంగా ఉందన్నారు. టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడారని అభినందనలు తెలిపారు.

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసాధారణ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించడం మన జాతికే గర్వకారణమని సోషల్ మీడియా వేదికగా భారత జట్టును అభినందించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shardul Thakur: అలా ఎలా వేశావ్ బ్రో.. ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్.. చెత్త రికార్డ్ ఇదే!

ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్‌గా కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లోనే 11బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

New Update
Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం పలు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో టైటిల్ కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్లు వరుస ఓటములను ఎదుర్కొంటున్నాయి. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన జట్లు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం అందరి అంచనాలకు మించి అద్భుతాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఎవరి ఊహలకు అందని చెత్త రికార్డులతో వార్తల్లో నిలుస్తున్నారు.  

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

చెత్త రికార్డు

ఈ 2025 సీజన్‌లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రీసెంట్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్  VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించినా.. శార్ధూల్ ఠాకూర్ మాత్రం ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. కేవలం ఒక్క ఓవర్‌లోనే 11 బాల్స్ వేశాడు. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

అది మాత్రమే కాకుండా వరుసగా 5 వైడ్లు వేశాడు. ఇది కూడా 2025 సీజన్‌లో ఒక చెత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే లాంగెస్ట్ ఓవర్‌ వేసిన బౌలర్ గా శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన శార్ధూల్ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

(shardul-thakur | IPL 2025 | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment