IPL మ్యాచ్‌లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. 11 మంది అరెస్టు

హైదరాదాల్‌లోని ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌- రాజస్థాన్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోది. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

New Update
IPL Match

IPL Match

ఐపీఎల్‌ సీజన్ మొదలైపోయింది. శనివారం రాత్రి ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ల మధ్య మొదటి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌- రాజస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. హైదరాదాల్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోది. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరంలో నలుగురు, ఎల్బీ నగర్‌లో ముగ్గురు, మల్కాజ్‌గిరిలో ముగ్గురు, భువనగరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: పార్లమెంట్‌లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్‌ ప్రారంభం

 ఇదిలాఉండగా ఆదివారం జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కోసం పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉప్పల్‌ స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: భారీ షాక్‌ ఇచ్చిన వాట్సాప్‌.. భారత్‌ కోటి ఖాతాలు తొలగింపు!

అంతేకాదు స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, స్ప్రేలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలకు పర్మిషన్ లేదని రాచకొండ సీపీ సుదీర్ బాబు చెప్పారు.

Also Read: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు