Ajinkya Rahane: KKR కొత్త కెప్టెన్‌ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ

ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. తాజాగా తమ కెప్టెన్‌‌ను కేకేఆర్ నైట్‌రైడర్స్ ప్రకటించింది. ఆజింక్య రహానేను కెప్టెన్‌గా వెల్లడించింది. అలాగే వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్ను నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్లో అనౌన్స్ చేసింది.

New Update
Ajinkya Rahane named captain of KKR

Ajinkya Rahane named captain of KKR Photograph

ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల అంటే మార్చి 22 నుంచే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను, కెప్టెన్‌లను ప్రకటించాయి. 

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ ఎవరా? అని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రింకు సింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు జోరుగా సాగాయి. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్‌ పేరు వినిపించింది. దీంతో కెకెఆర్ కెప్టెన్ ఎవరంటూ మరింత ఆసక్తి నెలకొంది. 

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

కెప్టెన్‌గా అతడే

ఈ క్రమంలో అందరి ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా కెకెఆర్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. మెగా వేలంలో రెండవ రోజు చివరి నిమిషంలో తీసుకున్న అజింక్య రహానేను ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా వెంకటేష్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేకేఆర్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. 

ఇది మాత్రమే కాకుండా కేకేఆర్ జట్టు ఈసారి సీజన్‌కు కొత్త జెర్సీతో సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కొత్త జెర్సీని నేడు రివీల్ చేసింది. ఆ జెర్సీపై మూడు స్టార్లకు స్థానం కల్పించింది. దీనర్థం.. ఇప్పటి వరకు కేకేఆర్ ఐపీఎల్‌లో మూడు టైటిల్స్‌ను కైవసం చేసుకోవడంతోనే జెర్సీపై మూడు స్టార్లకు స్థానం కల్పించారు.

Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్‌, సచిన్‌, గంగూలీ, యువరాజ్‌‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్‌కాస్ట్‌లో ధోని అన్నాడు. కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు.

New Update
Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)

Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni

భారత మాజీ కెప్టెన్ MS ధోని ప్రస్తుతం IPL 2025 సీజన్‌లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. రీసెంట్‌గా ఢిల్లీతో మ్యాచ్ అనంతరం అతడి రిటైర్మెంట్ వార్తలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ ధోనీ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. తన రిటైర్మెంట్ నిర్ణయించేది తాను కాదని.. తన శరీరమని చెప్పుకొచ్చాడు. ఇంకా ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచన చేయలేదన్నానరు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

అలాగే తనకు ఎదురైన ఓ కఠినమైన ప్రశ్నకు ఆసక్తికర సమధానం ఇచ్చాడు. గతంలో క్రికెటర్లలో ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారని ధోనీకి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు అదిరిపోయే సమాధానం చెప్పాడు. గతంలో భారత జట్టులోని 4గురు స్టార్‌ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

మళ్లీ ఛాన్స్ వస్తే

మళ్లీ ఛాన్స్ వస్తే గతంలో భారత జట్టులో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌ వంటి స్టార్ ప్లేయర్లతో తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. వీరూ పా (వీరేంద్ర సెహ్వాగ్‌) ఇన్నింగ్స్‌ ఓపెనింగ్ చేస్తాడు అని తెలిపాడు. అయితే కొన్ని కొన్ని సమయాల్లో పరిస్థితులు చాలా దారుణంగా, క్లిష్టంగా ఉంటాయని.. ఆ సమయంలో ఆటడం చాలా కష్టం అని అన్నాడు. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

అటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలి.. ఏ రీతిలో పెర్ఫార్మ్ చేయాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని.. అది అంత సులభం కాదని తెలిపాడు. కానీ ఈ ఆటగాళ్లు అలాంటి క్లిష్ట సమయాల్లో ఎలాంటి ప్రదర్శన చేశారో మనమంతా చూశామని అన్నారు.సెహ్వాగ్, సౌరభ్‌ గంగూలీ ఆడుతుంటే చాలా అందంగా అనిపిస్తుండేదని, ధైర్యంగా ఉండేదని ధోని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

(ms-dhoni | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment