AB De Villiers: ఆర్సీబీ కెప్టెన్ అతడే.. మరో ఆప్షన్ లేదన్న ఏబీడీ!

ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు.  

author-image
By srinivas
New Update
erererer

IPL 2025 : ఐపీఎల్ 2025 బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. కొన్ని జట్లతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కెప్టెన్ సమస్య ఉన్న విషయం తెలిసిందే. కాగా సీనియర్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి బాధ్యతలను చేపడతాడని డివిలియర్స్ అన్నాడు. అభిమానుల నుంచి కూడా డిమాండ్స్ ఉన్నాయని, ఆర్సీబీకి కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

ఇది కూడా చదవండి: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! 

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు..

‘కెప్టెన్సీపై కోహ్లీ ఇంకా స్పందించలేదు. కానీ ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. ఇప్పుడు మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడి మంచి బౌలర్లే. ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. స్పిన్‌ విభాగంలో ఆర్సీబీ వెనకబడింది. రవిచంద్రన్ అశ్విన్‌ను మిస్‌ అయ్యాం. మళ్లీ యెల్లో జెర్సీలో అశ్విన్‌ను చూడబోతుండటం ఆనందంగా ఉంది. ఆర్సీబీకి సరైన స్పిన్నర్‌ లేని లోటు తీరాలంటే ఐపీఎల్‌ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను తెరవాలి. భవిష్యత్తులోనైనా తీసుకొస్తుందని భావిస్తున్నా' అని అన్నాడు. 

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

In this week's show I cover India's win at Perth, Virat's 81st ton, Proteas vs SL, WTC table updates, Rajasthan Royals...

Posted by AB de Villiers on Wednesday, November 27, 2024

Also Read :  హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు