TDP Lokesh : యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు

లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.

New Update
TDP Lokesh : యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు

Lokesh Yuvagalam : వైసీపీ(YCP) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు.. ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర(Yuva Galam Padayatra) చేపట్టిన విషయం తెలిసిందే. . జనవరి 27న కుప్పంలో(Kuppam) ప్రారంభమైన యువగళం పాదయాత్ర పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఇటీవల రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. ఇటీవల యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.

ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

తాజాగా ఈ నెల 20వ తేదీన లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరంలో ముగింపు సభ ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు. చిత్తూరు, తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. రైల్వే కోడూరు, అనంతపురం నుంచి ఏడు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సుల కోసం అధికారులకు టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖ రాశారు. యువగళం జైత్రయాత్ర సభకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan), హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) తదితర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

ALSO READ:  ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల లోకేష్ దిగ్భ్రాంతి

ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని అన్నారు. టీచర్ల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులర్పిస్తున్నా అని పేర్కొన్నారు. సాబ్జీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori First Wife: అఘోరీని ఉరి తియ్యండి.. వాడికి భయంకరమైన శక్తులు- మొదటి భార్య సంచలన నిజాలు!

అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. ఆమెకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయని పేర్కొంది. తాను కూడా అఘోరీ ఏం చెప్తే అది వినేదాన్ని అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

New Update

అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపీసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ కోసం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరీ జండర్ తెలీకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌గా నిర్దారించి జైల్లో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

పూర్తిగా జైల్లోకి వెళ్తేనే

ఈ నేపథ్యంలో అఘోరీ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటి మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరీ ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి RTVతో మాట్లాడింది. ఇందులో భాగంగా అఘోరీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరీ అరెస్ట్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని.. పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పురుష బాధితులు

అఘోరీ దైవం అనే ముసుగులో వచ్చినపుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప.. కూతురు, శిష్యురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరీ బాధితులు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరీ ఒక ట్రాన్సజెండర్.. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగదీసుకుంటాడు. అఘోరీ మాయలో పడిన వారు బయటకు రావడం చాలా కష్టం అని ఆమె తెలిపారు. 

ఉరిశిక్ష పడాల్సిందే

ఆయన మాటలకు ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరీకి కఠిన శిక్ష పడాలని.. అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయం అని పేర్కొంది. అఘోరీకి వశీకరణ శక్తులు ఉండొచ్చని.. తాను కూడా అఘోరీ ఉన్నంత సేపు ఏం చెప్తే అదే వినేదాన్ని అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

aghori Arrest | lady aghori arrest | lady aghori arrest news | lady aghori arrest updates | Radha Reaction On Aghori Arrest | latest-telugu-news | telugu-news | Aghori First Wife

Advertisment
Advertisment
Advertisment