IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్

మొదటి మ్యాచ్ ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటోంది. రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే సౌత్ ఆఫ్రికాను ఆల్ అవుట్ చేసింది. భారత బౌలర్ ఆరు వికెట్లతో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు.

New Update
IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్

IND vs SA Second Test Match: ఇదీ మన వాళ్ళు అంటే..టీమ్ ఇండియా తలుచుకుంది అంటే అవతలి వాళ్ళు చిత్తు అయిపోవాల్సిందే. బాగా ఆడితే తమను ఢీకొట్టే వాళ్లే లేరని మరోసారి నిరూపించుకుంది టీమ్ ఇండియా. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లలో మొదటి మ్యాచ్ చిత్తుగా ఓడిపోయిన భారత టీమ్ రెండో మ్యాచ్‌లో మాత్రం విజృంభించేస్తోంది. మ్యాచ్ మొదలైన కొంతసేపటికే సఫారీలను పెవిలియన్ బాట పట్టించారు భారత బౌలర్లు.

Also read:గూగుల్ మ్యాప్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్!

కేప్‌ టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్. క్రీజులోకి దిగిన సఫారీ బ్యటర్లను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బెంబేలెత్తించాడు. 9 ఓవర్లలో ఆరు వికెట్లు తీసి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. బుమ్రాకు రెండు, ముకేశ్‌ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్‌ ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్‌ చేశాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment