Breaking:తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ సందేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశం పంపించారు. తాను తెలంగాణకు రాలేకపోయానని..కానీ మీ కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు సోనియా. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

New Update
Breaking:తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ సందేశం

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం పంపించారు.  తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత్రి నావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ వీడియో సందేశం పంపిచారు.  ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా కానీ మీరు ఎప్పుడూ  నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా...తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నా.. దొరల తెలంగాణ ని ప్రజల తెలంగాణ గా మనమందరం కలిసి మార్చాలి...దానిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ మాట్లాడారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి అని ఆకాంక్షించారు. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను అన ఇఅన్నారు. తెలంగాణ సోదరులు ,అమ్మలు , బిడ్డలకు నా విన్నపం ఒక్కటే...మార్పు కావాలంటే కాంగ్రెస్ కి ఓటేయండి. మార్పు కావాలి ..కాంగ్రెస్ రావాలి అంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు సోనియా గాంధీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు