Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారని.. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

New Update
Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మద్దతిచ్చారని.. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగేలా పార్టీ నేతలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా

' ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు మనవైపే ఉన్నారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధం కావాలి. అందరు కృషి చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో లాగే ఫలితాలు రావొచ్చు. అతినమ్మకం కూడా పనికిరాదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ కోల్పోయింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రజలను విభజిస్తూ శత్రుత్వాన్ని పెంచుతోందని' సోనియా గాంధీఅన్నారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా కేంద్రం.. రైతులను, యువతను పూర్తిగా విస్మరించిందని ఆగ్రం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా త్వరలో జమ్మూ కశ్మీర్, హర్యానా , మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment