Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్‌ సర్వసాధరణమైపోయింది. ఈ విషయంలో కొంతమంది తొందరపడి బ్రేక్‌ చెబుతుండగా.. మరికొంతమంది మంచిగా ఆలోచించే లవ్‌ బ్రేక్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

Good Love Relationship : ఒక చల్లని ఊహ, వెచ్చని స్పర్శ మనసును ఏదో లోకంలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రతి ప్రేమ(Love) లోనూ స్పర్శ ఉండకపోవచ్చు.. కానీ ఊహాలు మాత్రం ఉంటాయి. ప్రతి ప్రేమ పెళ్లి(Marriage) కి దారి తియ్యకపోవచ్చు.. కానీ నిజమైన ప్రేమికులు ప్రతిక్షణం వారు ప్రేమించినవారి కోసమే శ్వాసిస్తారు, ఆలోచిస్తారు. మనస్పర్థలు వచ్చి దూరంగా ఉన్నా వారి మంచి కోసమే పరితస్తారు. ఎంత దూరంగా జరిగినా దగ్గరగానే ఉన్నట్టే అనిపించే ప్రేమికులు(Lovers) ఉంటారు. మీకు అలా ఎవరితోనైనా అనిపిస్తే అలాంటి వారిని వదులుకోవద్దు. ఇక ఎలాంటి లక్షణాలున్న వారిని వదలుకోకూడదో ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం..!

--> సాధారణంగా ఏ ఇద్దరి మధ్య అయినా గొడవలు సాధారణమే. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సైలెంట్‌గా ఉంటే ఆ గొడవ కాసేపటికి సమిసిపోతుంది. మీరు మీ లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌(Life Partner) పై అరిచినప్పుడు లేదా లిమిట్‌ దాటి తిట్టినప్పుడు తిరిగి ఏం అనకుండా, వాళ్లు కామ్‌గా ఉంటే అలాంటివారిని అసలు వదులుకోవద్దు.

--> కొన్నిసార్లు మీరు మీ కుటుంబం, మీ స్నేహితులు అంగీకరించని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయంలో వారంతా మిమ్మల్ని కూడా వదిలేస్తారు. అప్పుడు మీ బాయ్‌ఫ్రెండ్‌/గర్ల్‌ఫ్రెండ్‌ మీకు సపోర్ట్‌గా నిలిస్తే వారిది నిజమైన ప్రేమగా భావించవచ్చు.

--> మీ ఇద్దరి మధ్య చాలా విషయాల్లో వివాదం ఉన్నప్పటికీ ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకుంటే అది రియల్‌ లవ్‌ అని చెప్పవచ్చు. అనేక విషయాలపై మీకు భిన్నమైన దృక్పథాలు ఉండవచ్చు.. కానీ ఒకరు ఆలోచనలు మరొకరు గౌరవించుకుంటూ ఉంటే మీ రిలేషన్‌షిప్‌ సరైన మార్గంలో వెళ్తున్నట్టే అనుకోవచ్చు. మీ అభిరుచులకు తనకు నచ్చకున్నా వాటిని గౌరవిస్తూ మిమ్మల్ని అవి మానేయమని చెప్పకుండా ఉంటున్నారంటే అది వారిలో మంచి లక్షణం కావొచ్చు.

--> ఒకరినొకరు కోల్పోతామనే భయం ఉన్నా అది ప్రేమే కావొచ్చు. అయితే ఇది ప్రతీసారి ప్రేమ అవ్వాలని లేదు. కొన్నిసార్లు అభద్రత కూడా ఇలాంటి ఆలోచనలను కలగిస్తుంది. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ భయం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోగలగాలి. ఒకవేళ మీ లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌ మీరు హర్ట్‌ చేసినా మీతోనే ఉండాలని, మీతో మాట్లాడి గొడవను పరిష్కరించుకోవాలని ఆలోచిస్తుంటే వారిది నిజమైన ప్రేమ కావొచ్చు.

--> సాధారణంగా మన ఆలోచనలు(Thoughts) మన లవర్‌ ఆలోచనలకు సరిపోలాలని అందరూ కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేకున్నా అది నిజానికి జరగని పని.. ఎందుకంటే ఏ రెండు మనసులు ఒకేలాగా ఉండవు. అయితే నిజమైన ప్రేమలో భాగస్వాములు ఇద్దరూ ఒకరి ఆలోచనలను మరొకరు స్వీకరిస్తారు..వాటికి మద్దతుగా ఉంటారు. తమ అభిప్రాయాలను ఒకరిపై ఒకరు రుద్దరు. విభేదాలు ఉంటే అంగీకరిస్తారు. కానీ ఒకరి ఆలోచనలను మరొకరు చెరిపివేసేందుకు ప్రయత్నించరు.

ఇది కూడా చదవండి: చికిత్స లేని వ్యాధి.. లైంగిక కోరికలు రాకుండా చేసే ఈ రోగం గురించి తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment