Bangladesh: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ పొడిగింపు..కనిపిస్తే కాల్చివేత

బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. హింసతో దేశం అట్టుడికిపోతోంది. విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వీటిని ఆపేందుకు అక్కడ ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కర్ఫ్యూను పొడిగించింది.

New Update
Bangladesh: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ పొడిగింపు..కనిపిస్తే కాల్చివేత

Shoot at site orders: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని విద్యార్ధులు. ఇది కాస్తా మితిమీరి హింస వరకు వెళ్ళింది. దీని కారణంగా ఇప్పటివరకు 114 మరణించారు. మరో 2500 మందికి పైగా గాయపడ్డారు. దాంతో బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధించారు. విద్యార్ధుల అల్లర్లు ఇంకా ఆగకపోవడంతో దానిని ఈరోజు సాయంత్రం వరకు పొడిగించారు. హింసాకాండ కారణంగా దేశంలోని పలు నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిషేధించారు. మరోవైపు బంగ్లాదేశ్‌ నుంచి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ దేశాలకు వెళ్తున్నారు.

బంగ్లాలో సివిల్ సర్వీస్ పోస్టుల్లో మూడింట ఒక వంతు వారి వారసులకు రిజర్వ్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల కోటాను హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో జూలై 1న ఆందోళన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది.ఢాకా, చటోగ్రామ్, రంగ్‌పూర్, కుమిల్లాతో సహా బంగ్లాదేశ్‌లోని నగరాల్లో వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాళ్లతో సాయుధ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థుల నిరసన, రాళ్లదాడి కారణంగా ఢాకాతోపాటు దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో అంతరాయం ఏర్పడింది. ఇది ప్రజలకు కష్టాలకు దారితీసింది. ఎనిమిది జిల్లాల్లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. రోడ్లు, రైలు మార్గాలను అడ్డుకున్నారు.

ఈ నిరసనలు మరీ ఎక్కువ అవడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను కూడా కాన్సిల్ చేసుకున్నారు. ఆమె ఆదివారం స్పెయిన్, బ్రెజిల్‌లను సందర్శించాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఛత్తీస్‌ఘఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న కాల్పులు

ఛత్తీస్‌ఘఢ్‌లో బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

New Update
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

Encounter in Chhattisgarh

ఛత్తీస్‌ఘఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య పరస్పరం కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

22 మంది కీలక కమాండర్లు..

ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్లతో భారీగా నష్టపోతుండగా తాజాగా మరికొంతమంది దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెనికి చెందిన 22 మంది కీలక కమాండర్లు సరెండర్ అయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ తెలిపారు. ఈ మేరకు ‘పోరుకన్నా ఊరుమిన్న.. మన ఊరికి తిరిగిరండి’ అనే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని శబరీష్ చెప్పారు.  అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లొంగిపోయిన వారి వివరాలను వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ముచ్చకి జోగారామ్, ఏరియా కమిటీ మెంబర్‌ మడవి మాస, తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా, పార్టీ దళ సభ్యులు పూనెం సుక్కు, జనతన సర్కారు కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాస సోడి, మడకం దేవా, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న, కొత్తకొండ మజ్జి హైమవతి లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్‌పీఎఫ్‌ పీఎంజీ పంచమీలాల్, డీఎస్పీ ఎన్‌.రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

 

Advertisment
Advertisment
Advertisment