T20 World Cup 2024: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్‌..!!

2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే.

New Update
Pubity 2023 Award : స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత

ఈ ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చినప్పటికీ భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత జట్టు 11 మ్యాచ్‌లలో 10 గెలిచింది. అయితే ఒక బ్యాడ్ మ్యాచ్ కోట్లాది మంది భారతీయ అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. భారత ఆటగాళ్లు, అభిమానులు ఇప్పుడు ఆ ఓటమి నుంచి తేరుకున్నారు. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో ఆడనున్న T20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా కూడా సన్నాహాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లికి సంబంధించి ఓ పెద్ద అప్ డేట్ బయటకు వచ్చింది.

నిజానికి, రోహిత్ శర్మ, టీమ్ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ మధ్య టి 20 ప్రపంచ కప్ 2024 సన్నాహాలు, రాబోయే రోడ్ మ్యాప్ గురించి సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అనేక అంశాల గురించి చర్చించారు. నివేదికల ప్రకారం ప్రపంచ కప్‌లో జట్టు కోసం సెలక్ట్ చేసే వారి జాబితాను వెల్లడించాలని రోహిత్ శర్మ కోరినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీపై కూడా చర్చ జరిగింది.

2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, ఎవరైనా ఇద్దరు ఆటగాళ్ల గురించి ఎక్కువగా చర్చించుకుంటే, వారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది అభిమానులకు తెలియాల్సి ఉంది. నివేదికల ప్రకారం, టీమ్ మేనేజ్‌మెంట్ కూడా టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని కోరుకుంటుంది. అయితే విరాట్ కోహ్లీని జట్టు నుండి తొలగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నంబర్‌లో BCCI జట్టు కోసం తగినంత వేగంగా బ్యాటింగ్ చేయగల ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, అతన్ని టి20 జట్టు నుండి ఎలా తప్పించగలరనేది తలెత్తే అతిపెద్ద ప్రశ్న. విరాట్ కోహ్లీ ఇటీవల ఆడిన ODI ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు, అటువంటి పరిస్థితిలో, ఫామ్‌లో ఉన్న తర్వాత కూడా విరాట్ కోహ్లీని ప్లాన్ నుండి తప్పించడం కూడా టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ లేకపోలేదు.

ఇది కూడా చదవండి: దేశంలో 12.5శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..NCRB రిపోర్టులో షాకింగ్ విషయాలు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: మాజీ క్రికెటర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు. 

New Update
Former cricketer Keith Stackpole

Former cricketer Keith Stackpole

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

 

 

Advertisment
Advertisment
Advertisment