Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది.

New Update
Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

New Update
Trump

Trump

అమెరికా ,చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

లేదంటే ఏప్రిల్‌ 9 నుంచి 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి  చెప్పారు.అమెరికా పై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్‌ లు విధిస్తోంది.కంపెనీలకు అక్రమ రాయితీలు,దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది.

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

నేను హెచ్చరించినప్పటికీ..అదనపు సుంకాల ద్వారా అమెరికా పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున్న విధిస్తాం. అందువల్ల ..ఏప్రిల్‌ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

లేకపోతే..ఏప్రిల 9 నుంచే ఆ దేశం పై 50 శాతం అదనపు టారిఫ్‌ లు విధిస్తాం.  ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.అంతకు ముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్‌ సైతం దీటుగా స్పందించింది.

రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడం పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతుల పై నియంత్రణలు ప్రకటించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాల పై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ  విషయంలో ఇప్పటికే బీజింగ్‌ తీరుఉ,తప్పుపట్టిన ట్రంప్‌..తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచతానంటూ స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

china | america | tarriffs | beijing | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment