Telangana: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరికి ఛత్తీస్గఢ్కు చెందిన యువతికి హైదరాబాద్లో ఉంటున్న స్వామి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి ఆమెను లొంగదీసుకొని మోసం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. By B Aravind 30 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రేమ పేరుతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్కు చెందిన యువతి.. హైదరాబాద్లో ఉంటున్న స్వామి అనే వ్యక్తి..ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని స్వామి నమ్మించాడు. ఆమెను హైదరాబాద్కు రావాలని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని యువతి అడిగింది. చివరికి అతడి ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వామిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. Also read: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్ షాక్.. #telangana #cheating #crime సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి