Mumbai : ముంబై యాక్సిడెంట్‌ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్

ముంబై వర్లీలో అతి వేగంగా వెళుతున్న బీఎమ్‌డబ్ల్యూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఈ యాక్సిడెంట్‌ను శివసేన సీనియర్ నేత రాజేష్ షా కుమారుడు చేశాడని తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

New Update
Mumbai : ముంబై యాక్సిడెంట్‌ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్

Accident : అధికార మత్తు, మద్యం మత్తు రాజకీయ నేతల కళ్ళు మూసుకుపోయేలా చేస్తున్నాయి. తమను ఏం చేసేవారు లేరన్న అహంకారంతో యాక్సిడెంట్‌లు చేస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్‌ (Hyderabad) లో బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడి యాక్సిడెంట్ గురించి విన్నాము. ఇప్పుడు ముంబయ్‌ (Mumbai) లో శివసేన (Shiv Sena) నేత కుమారుడు ఇదే పని చేశాడు. శివసేన ఉపనేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ఈ యాక్సిడెంట్‌ను చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఇతను ర్యాష్‌గా కారు నడపమే కాకుండా.. ఓ మహిళ చావుకు కారణమ్యాడు. అయితే ఇతను ఈ ఘటన తరవాత పరారీలో ఉన్నాడు.

ప్రస్తుతం మిహిర్ షా బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు టెస్ట్‌కు పంపించారు. దాంతో పాటూ రాజేష్ షాను అతని డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు యాక్సిడెంట్ కేసులో సహకరించనందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను నాశనం చేయడం లాంటి ఆరోపణల కింద వారి మీద కేసులను నమోదు చేశారు.

యాక్సిడెంట్ అయిన బీఎమ్‌డబ్ల్యూ కారు (BMW Car) మిహిర్ పేరు మీదనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిహిర్ షా జుహూలోని బార్‌లో మద్యం తాగాడు. ఆ తర్వాత అతను డ్రైవర్‌ను లాంగ్‌ డ్రైవ్‌కు తీసుకెళ్ళమని అడిగాడు. కారు వర్లీకి వచ్చింది. అక్కడ మిహిర్ తాను డ్రైవ్ చేస్తానని పట్టుబట్టాడు. డ్రైవర్ ఎంత వద్దని చెబుతున్నా వినలేదు. డ్రైవింగ్ మొదలుపెట్టిన కాసేపటికే కారుతో స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఇందులో కోలివాడకు చెందిన కావేరి నక్వా, భర్త ప్రదీక్ నక్వా స్కూటర్ మీద ఉన్నారు. కారు గుద్దడంతో ఇద్దరూ ఎగిరి వెళ్ళి దూరంగా పడ్డారు. తరువాత ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ కావేరి చనిపోగా..ప్రదీక్ కోలుకుంటున్నారు.

Also Read:Telangana: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment