వరద ఉధృతిలో Rtv బృందం సాహసం..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో Rtv టీమ్ సాహసం చేసింది. భారీగా వస్తున్న వరదను సైతం లెక్క చేయకుండా నది ప్రవాహంలోకి దిగి రైతుల, గ్రామస్తుల కష్టాలను తెలుసుకుంది. తమకు ప్రభుత్వం సహకారం అందించాలని రైతులు Rtv ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం!
ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.
రాజీనామాకు ససేమిరా,మణిపూర్ సీఎం బీరేన్ సింగ్
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆనాడే ప్రధాని మోడీ జోస్యం
విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ 2019 లోనే జోస్యం చెప్పారు. నాడు తన ప్రభుత్వం పై అవి అవిశ్వాసం పెట్టినప్పుడు 2023 లో కూడా ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ వర్గాలు ఆ నాటి ఆయన ప్రసంగాన్ని మళ్ళీ బుధవారం గుర్తుకు తెచ్చాయి. మణిపూర్ అంశంపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
పోటెత్తిన గోదావరి..రాములోరి గుడి చుట్టూ నీళ్లు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
యమునా నదిలో పేలిన గ్యాస్ పైప్లైన్, భయాందోళనలో స్థానికులు
ఉత్తరప్రదేశ్ జగోష్ గ్రామ సమీపంలోని యమునా నది నీటి అడుగున ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ(IPGL)కి చెందిన గ్యాస్ పైప్లైన్ ఒక్కసారిగా పేలిపోయింది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కానీ క్యామ్లో మాత్రం కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం.నదిలో 30 అడుగుల ఎత్తులో నీరు(30 Feet Hight Water) ప్రవహిస్తున్నట్లుగా వీడియోలో దృశ్యాలను చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి.
ఉత్తమ్ పార్టీ మార్పు పై మళ్లీ జోరుగా ప్రచారం..ఉద్దేశపూర్వకంగానే!!
కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రియాక్ట్ అయిన ఉత్తమ్ అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలోని వారే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడుతున్నారు.
తెలంగాణకు రెడ్ అలర్డ్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు రేపు 204 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందనిహెచ్చరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/udhav-thakre-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/65498-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-riporter-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-34.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-cm-resign-central-government-parliament-mijoram-assam1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/india-prime-minister-modi-jyosyam-2019-2023-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachalam-1-300x210.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-27.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Uttam-party-is-campaigning-again-on-change.intentionally-300x155.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rains-jpg.webp)