Supreme Court: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు

పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును సాధారణ ఎన్నికల్లోపే అమలు చేయాలని ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకురాలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణనకు ముందే దీన్ని అమలుచేయడం కష్టమని పేర్కొంది.

New Update
Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీలో మూడోవంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేస్తూ బీజేపీ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) తర్వాతే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. చట్టసభల్లో 15 ఏళ్ల వరకు మహిళకు లోక్‌సభ, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. ఇక డిలిమిటేషన్ తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఇవ్వడం జరుగుతుంది.

Also read: భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా!

వాస్తవానికి డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాల్సి ఉంటుంది. అయితే 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే ఈ బిల్లును ఇప్పుడే అమలు చేయాలని కాంగ్రెస్‌తో సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో తెచ్చిన ఈ మహిళా బిల్లును రానున్న సాధారణ ఎన్నికల్లోపే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో జనగణన అనంతరం అమల్లోకి వస్తున్న అని చెబుతున్న భాగాన్ని కొట్టేయడం చాలా కష్టమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చేందుకు తిరస్కరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు