BREAKING : జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?

ఏపీ ప్రభుత్వానికి మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు. అప్కాస్‌లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు.

New Update
BREAKING : జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?

Shock To Jagan : ఇప్పటికే సమ్మెలో ఉన్న అంగన్వాడీ లు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది డిమాండ్లతో తలలు పట్టుకుంటున్న వైసీపీ(YCP) సర్కార్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు.

అప్కాస్ లో తీసుకోవాలి:
ఈ రోజు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు 108, 104 సిబ్బంది. అప్కాస్‌(APKAS) లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలు డిమాండ్‌గా కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నారు. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 108, 104ను అరబిందో సంస్థ నిర్వహిస్తున్న విషయంత తెలిసిందే. 108, 104లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

తొలిసారి ఏపీలోనే:
దేశంలో 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ అనేది ఒక ఉచిత అత్యవసర సేవ. ఇది అవసరమైన ప్రజలకు రవాణా మరియు వైద్య సంరక్షణను అందిస్తుంది. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాల్ వచ్చినప్పుడు, దగ్గరలో అందుబాటులో ఉన్న అంబులెన్స్(Ambulance) కాల్ చేసిన ప్రదేశానికి పంపుతారు. అంబులెన్స్ సిబ్బందిలో డ్రైవర్, పారామెడికల్, డాక్టర్ లేదా నర్సు ఉంటారు. పారామెడికల్ ప్రాథమిక జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. డాక్టర్ లేదా నర్సు అధునాతన జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. అంబులెన్స్‌లో డీఫిబ్రిలేటర్, ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్(First Aid Kit) వంటి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - ఈఎంఆర్‌ఐ(EMRI) సహకారంతో 108 అంబులెన్స్ సేవలను తొలిసారిగా 2005 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఈ సేవలు విస్తరించాయి. జీపీఎస్ ట్రాకింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, మొబైల్ మెడికల్ యూనిట్లు లాంటి ఆవిష్కరణలను చేర్చడానికి ఈ సేవ కాలక్రమేణా అభివృద్ధి చెందింది.

Also Read: అభిమాని చెంప చెల్లుమనిపించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌.. బుద్ధి మారదుగా.. వీడియో వైరల్!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment