Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో వివేకా హత్య.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్.. సజ్జల హాట్ కామెంట్స్

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. సునీత ఈరోజు ముసుగు తీసేసిందని అన్నారు. చంద్రబాబు చేతిలో పావులా ఆమె ఉన్నారని చురకలు అంటించారు.' సునీత ఎవరి ప్రతినిధి అనేది ఈరోజు తెలిసిపోయింది. వివేకానంద ఎమ్మెల్సీ గా ఓడిపోవడానికి కారణం ఎవరు?. వైసీపీ పార్టీకి పూర్తి మెజార్టీ ఆరోజు ఉంది. జగన్ తల్లి విజయమ్మని ఓడించాలనుకున్న వివేకాను దగ్గర చేర్చుకున్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపింది. వివేకాను ఓడించింది బీటెక్ రవి కదా.

Also Read: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా ?

మరి అదే చంద్రబాబు, బీటెక్ రవితో.. సునీత ఎలా జట్టు కట్టారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే కదా. 4, 5 రోజుల్లో తెలిపోవాల్సిన కేసు. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదు. చంద్రబాబును సునీత అడగాలి కదా. ఇది రాజకీయ కుట్ర తో జరుగుతోంది. వైసీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే మా నుండి వెళ్లిన వాళ్ళని ఎందుకు చంద్రబాబు తీసుకుంటున్నాడు. సునీత కుటుంబ సభ్యుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. విచారణ అన్నింటిపైన జరుగుతాయి. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా?.

పవన్ మోసం అర్థమైపోయింది

24 సీట్లను పవన్ 240 సీట్లు అనుకుంటున్నట్టున్నాడు. పోటీకి అభ్యర్థులు లేని పవన్ కళ్యాణ్ ఏం తొక్కుతాడు. పదేళ్ల కిందట పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు. తాడేపల్లి గూడెం సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. తొలి సమావేశంతోనే టీడీపీ-జనసేన పొత్తు ఫెయిల్ అని తేలిపోయింది. పవన్ అందరిని మోసం చేశాడని కాపు నాయకులకే అర్థమైపోయింది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

Also Read:  వైసీపీ 9వ జాబితా విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

New Update
Pawan Kalyan younger son

Pawan Kalyan younger son Photograph: (Pawan Kalyan younger son)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం పవన్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్ తదితరులు స్పందించారు. 

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

మెగాస్టార్ స్పందిస్తూ..

పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు. కాకపోతే స్వల్పంగా కాళ్లకు గాయాలయ్యాయని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. మార్క్ శంకర్‌కు గాయాలైన ఘటన ఆందోళన కలిగించిందని అన్నారు. సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్‌ అయినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

 

nara lokesh | Pawan Kalyan | chandrabau | andhra-pradesh-news | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment