Rohit: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3 వస్థానంలో రోహిత్ శర్మ!

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ 3వ స్థానానికి ఎగబాకాడు.రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేశాడు. 

New Update
Rohit: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3 వస్థానంలో రోహిత్ శర్మ!

ICC One Day Rankings: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) 3వ స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దుబాయ్‌లో ఉత్తమ వన్డే ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో, అతను 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధసెంచరీలతో సహా 157 పరుగులు ('స్ట్రైక్ రేట్' 141.44) చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli) చెత్త ప్రదర్శనతో (752) 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ (824 పాయింట్లు), భారత్‌కు చెందిన శుభమన్ గిల్ (782) తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు.

కుల్దీప్ 'నం-4': బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు ఎగబాకిన భారత ఆఫ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మరో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో కలిసి 4వ స్థానాన్ని (ఒక్కొక్కటి 662 పాయింట్లు) పంచుకున్నాడు. శ్రీలంక సిరీస్‌లో అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో 5 వికెట్లు తీసిన తమిళనాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్ 45 స్థానాలు ఎగబాకి 97వ ర్యాంక్‌ను పంచుకున్నాడు.

Also Read: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment