Hyderabad : ఎయిర్ పోర్ట్‌లో చుక్కలు చూపిస్తున్న చిరుత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. నాలుగు రోజులగా అక్కడే తిరుగోంది కానీ పట్టుబడడంలేదు. బోన్‌ వరకు వచ్చి వెళిపోతోంది. మేకను ఎరగా వేసినా పట్టించుకోవడం లేదు.

New Update
Breaking: కట్టెల కోసం వెళ్లిన మహిళ తలను తిన్న పులి.. ఏపీలో దారుణ ఘటన!

Shamshabad Airport : నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌(Hyderabad) లోని శంషాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే మీద ఒక చిరుత(Cheetah) కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు హైల అలర్ట్ ప్రకటించారు. అప్పటి నుంచి చురుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తం 9 టరాప్ కెమెరాలతో పాటూ ఒక బోన్‌ను ఏర్పాటు చేశారు. రోజూ ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజు క్రితం షాద్‌నగర్‌లోనూ చిరుత కనిపించింది. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి ఉంటుందని అదికారులు భావిస్తున్నారు. ఈ చిరుతతో పాటూ రెండు పిల్లలు కూడా సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మొదటిసారి ఎయిర్ పోర్ట్ ప్రహారీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత కాలు తగలడంతో అలారం మోడింది. అప్పుడు గమనించగా చిరుత తిరుగుతున్నట్టుగా తెలిసింది.

ఇంకా కొనసాగుతున్న వేట..

అయితే నాలుగు రోజులుగా చిరుత ఎయిర్ పోర్ట్ సిబ్బంది(Airport Staff) కి చిక్కడమే లేదు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం తప్పించుకుంటోంది. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు చిరుతను పట్టుకోవడానికి బోనులో మేకను ఎరగా కూడా వేశారు. అయితే అది మాత్రం చాలా తెలివిగా బోను వరకు వస్తోంది కానీ అందులోకి దూరడం లేదు. మేకను చూసి కూడా లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో తిరుగుతోంది కానీ ట్రాప్‌కుమాత్రం చిక్కడం లేదు. నాలుగు రోజులుగా దీన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి.

Also Read:Delhi: నాలుగు కాదు యాభై స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..తనిఖీలు చేస్తున్న పోలీసులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!

అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని' వెండితెరపై చూపించాలనేది తన కల అని చెప్పారు. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
Aamir Khan

Aamir Khan

Aamir Khan:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన  'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

'మహాభారతం' నా కల 

ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..  నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని  చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని..  ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో  సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము.  అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

1000 కోట్ల..

అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

latest-news | cinema-news | Aamir Khan Mahabharat

Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

Advertisment
Advertisment
Advertisment