Telangana: టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణగా ఉంది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ఈ సిచ్యువేషన్‌లో పుడ్ ఐటమ్స్ సమయానికి డెలివరీ చేయలేమని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో వర్కర్లు. టైమ్ తీసేయండి అని అడుగుతున్నారు.

New Update
Telangana:  టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్

Food Delivery Time Bound:  తెలుగు రాష్ట్రాలను వర్షాలను పట్టి కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆగకుండ పడుతూనే ఉన్నాయి. దీని వల్ల చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే వాతావరణం ఇలాఏ ఉంటుందని చెబుతోంది ఐఎండీ. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పుడ్ డెలివరీ యాప్‌లకు మ్ రిస్ట్రిక్షన్ తీసేయాలని కోరుతున్నారు వర్కర్లు. ప్రస్తుత పరిస్థితుల్లో టైమ్‌కు ఉడ్ డెలివరీ చేయాలంటే కష్టంగా ఉందని వారు చెబుతున్నారు. అలా చేయకపోతే కస్టమర్లు దాడులు చేస్తున్న సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ డెలివరీ, రైడింగ్ సర్వీసులపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఆందోళన వక్తం చేసింది. సమయానికి డెలివరీ చేయాలనే నిభందనను తీసేయాలని ఆయా కంపెనీలను డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సమయానికి రాలేరని తెలిపింది.

స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, జెప్టో, బాగ్ బాస్కెట్ లాంటి డెలివరీ ఫ్లాట్ ఫామ్‌లు అన్నింటిలో సమానుకూలంగా డెలివరీ అవసరాలను తొలగించాలని..వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సర్ ఛార్జ్‌లను ప్రవేశ పెట్టాలని వర్కర్స్ యూనిన్ కోరింది. దీంతో పాటూ డెలవరీ బాయ్స్‌కు రెయిన్ కోట్లు, ఫోన్ కవర్లు, పవర్ బ్యాంక్‌ల్లాంటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉబర్, ఓలా, రాపిడో సర్ఈసుల్లో వరదల వల్ల దెబ్బ తిన్న కార్లకు రిపేర్ల కోసం లక్షరూపాలను అందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అత్యవర ఆదేశాలను జారీ చేయాలని వర్కర్ల యూనియన్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Also Read: Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment