Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.

New Update
Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..

Three Reasons Behind MLA Lasya Nadita Death: రోడ్డు ప్రమాదాలు చాలా డేంజరస్‌గా తయారవుతున్నాయి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతున్నారో తెలుసుకోవడం కూడా చాలా కష్టమైపోతున్నాది. నిన్న కళ్ళ ముందు కనిపించిన వారు ఈరోజు ఉండటం లేదు. తాజాగా ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం మాటల్లేకుండా చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్నXL6 కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి మూడు కారణాలు..

లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న మారుతి సుజుకీ XL 6 కారులో ప్రయాణం ఒక కారణం. దీని తరువాత లాస్య నందిత సీటు బెల్టు వేసుకోకపోవడం మరో కారణం. మిడిల్ లేదా వెనుక సీటులో కూర్చున్నవారు సీటు బెట్ల్ వేసుకోనక్కర్లేదనే భ్రమలో ఉంటారు. ముందు కూర్చున్న వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది...వెనుక ఉంటే ఏమీ అవదనే అనుకుంటారు. అందుకే దాదాపు 90 శాతం మంది వెనుక సీటు లేదా మిడిల్ సీటులో కూర్చున్న వారు సీటు బెల్ట్ వేసుకోరు. కానీ ఇప్పుడు మధ్య సీటులో కూర్చున్న లాస్య సీటు బెల్ట్ వేసుకోని కారణంగా ప్రమాదం జరిగినప్పుడు ఆమె ముందు సీటుకు వెళ్ళి బలంగా ఢీకొన్నారు. దీంతో ఆమె తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించారు. ఇక మూడో కారణం నిద్రమత్తు. లాస్య కారును నడుపుతున్న ఆమె పీఏ నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఇతనే స్కార్పియో కారును నడిపినప్పుడే ఒక ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు లాస్ ఆ ప్రమాదంలో చిన్న గాయాలతో బయటపడి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే డ్రైవర్ డ్రైవింగ్‌లో ప్రాణాలను పోగొట్టుకున్నారు.

దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది తిరిగేసరికి మళ్ళీ అదే ఫిబ్రవరిలో లాస్య ప్రమాదంలో మరణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్‌‌లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.

New Update
Pahalgam attack 123

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో టూరిస్టులతో ఉగ్రవాదులు మాట్లాడారు. పర్యటకులందరినీ తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి ముస్లింలు కానివారిని కాల్చి చంపారని ప్రత్యేక్ష సాక్షి పల్లవి చెబుతున్నారు. ఆమె భర్త తన పేరు మంజునాథ్ అని చేప్పగానే అతన్ని కాల్చి చంపారని ఆమె తెలిపారు. తనని కూడా చంపమని ఆమె ఉగ్రవాదులను వేడుకుందట. ఇక్కడ జరిగిందంతా మోదీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలని ఓ టెర్రరిస్ట్ ఆమెతో అన్నాడని తెలుస్తోంది. టెర్రిస్టులు కాల్పులకు ముందు పర్యటకులతో మాట్లాడిని సంభాషణ గురించి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Also read: J&K Terror Attack: ‘పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు’

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో మంగళవారం సాయంత్రం టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 30మంది మృతి చెందారు. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ఆకస్మాత్తుగా ఫైరింగ్ చేశారని ప్రత్యేక్ష సాక్షులు, క్షతగాత్రులు చెబుతున్నారు.

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

Advertisment
Advertisment
Advertisment