Social media: రాముడితో పాటూ రావణుడూ ట్రెండింగ్..

రాముడు ఎక్కడ ఉంటే రావణుడు అక్కడ ఉంటాడు. రావణుడు లేని రాముని కథ ఉండదు. భారతదేశంలో రాముడు అందరికీ దేవుడే అయినా సౌత్ వాళ్ళకు మాత్రం రావణుడు కూడా ఆరాధ్యుడే. అందుకే ఇప్పుడు అయోధ్య రాముడు ట్రెండ్ అవుతున్న వేళ రావణుడు కూడా ట్రెండింగ్ అవుతున్నాడు.

New Update
Social media: రాముడితో పాటూ రావణుడూ ట్రెండింగ్..

Ravana:ప్రతీకథలోనూ ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉంటాడు. అది ఇప్పుడు అయినా అప్పుడు అయినా. దేవుళ్ళ కథలైనా..రాజుల చరిత్రలైనా...నేటి హీరోల సినిమాలు అయినా ఇదే పంథా. చెడుపై మంచి సాధించే విజయానికే ఎప్పుడూ విలువ ఉంటుంది. వాల్మీకి రామాయణం కూడా ఇదే చెబుతోంది. రావణుడిపై రాముడు సాధించిన విజయమే ఈ గాథ. మనుషులకు రాముడు ఆదర్శమయితే...ఇందులో విలన్, రాక్షసుడు కూడా ఆదర్శమే. ఒక అత్యంత ప్రతిభాశాలి క్రూరుడు, రాక్షసుడు అయి ఎలా నాశనం అయిపోయాడో చెప్పే కథే రామాయణం.

Also Read:అయోధ్య రామునికి ఏడువారాల నగలు..వాటి విలువ ఎంతో తెలుసా..

రామాయణం...నార్త్, సౌత్...
భారతదేశంలో నాలుగు దిక్కులున్నా ముఖ్యంగా రెండింటినే చెప్పుకుంటారు. అవే ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఇవి రెండూ వేరు వేరు కల్చర్లతో కూడి ఉంటాయి. మొత్తంగా భారతీయులు అందరూ ఒకే హిందూత్వాన్ని, ధర్మాన్ని పాటిస్తున్నా...లోపలికి వెళితే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. రామాయణం విషయంలో కూడా ఈ తేడా ఎప్పటి నుంచో ఉంది. భారతీయులందరికీ రాముడు ఆరాధ్య దేవుడే. కానీ దక్షిణ భారతీయులకు రావణుడు కూడా ఆరాధ్యుడే. ముఖ్యంగా తమిళులు తాము రావణుని వారసులమని చెప్పుకుంటారు. కొన్న ఇచోట్ల ఆయనకు ఆలయాలు కూడా కట్టి పూజిస్తున్నారు. సకల కళా పారంగతుడు అయిన రావణుని వారసులం అని దక్షిణాదులు గర్వంగా చెప్పుకుంటారు.

ట్రెండ్ అవుతున్న రావణుడు..

గత కొన్ని రోజులుగా భారతదేశం రామనామం జపిస్తోంది. ముఖ్యంగా నిన్నంతా కూడా రామమయం అయిపోయింది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. సోషల్ మీడియాలో రాముని పేరు సూపర్ ట్రెండ్ అయింది. అయితే అదే సమయంలో రావణుడి పేరు కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. దీనికి కారణం తమిళులు. నార్త్ అంతా తమ దేవుడు అయిన రాముని పేరును ట్రెండ్ చేస్తే దక్షిణ భారత ప్రజలు రావణుడి పేరు ట్రెండ్ చేశారు. ముఖ్యంగా తమిళులు. రావణుడి గొప్పతనాన్ని, తాము ఎలా ఆయన వారసులమో చెబుతూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు.

ఎక్స్‌లో రావణుడికి సంబంధించి బోలెడు పోస్ట్‌లు వచ్చాయి. ఇందులో రావణుడు గొప్ప హీరో అని అబివర్ణించారు. అతను కళలలో ఉత్తముడు, పది తలలు ఉన్నాయంటూ పొగిడారు. తమిళులుగా తాము రావణుని వారసులమని చెప్పడానికి ఎంత మాత్రమూ సిగ్గుపడమని, అది తమకు గర్వకారణమని రాశారు. అలాగే తమిళనాడు రావణభూమిగా చెప్పుకున్నారు.

ఒకరిని హీరో చేయాలంటే మరొకరిని విలన్‌చేయక తప్పదు కాబట్టే రాముడిని మహానుభావుడిగా చేసేందుకు రావణుడిని రాక్షసుడిగా చేశారని అంటున్నారు తమిళయన్లు. శివ కుమారులు, భక్తులను కించపరిచేందుకే రావణుడిని సాధనంగా ఆర్యులు సాధనంగా చేసుకున్నారని అంటున్నారు. ప్రపంచంలో ఏ శివభక్తుడు అయినా మనవాడే అంటున్నారు తమిళయన్లు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Love: ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో

శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

అఘోరీ - శ్రీవర్షిణీ ఎపిసోడ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో నడిచిన వీరి కథ.. ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వీరిద్దరూ వీరి నాలుగు నెలల ప్రేమ బంధానికి గుర్తుగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఒకసారి కాకపోవడం గమనార్హం. వేరు వేరు ప్రాంతాల్లో రెండు సార్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వర్షిణీని అఘోరీ బంగారు చైన్‌ వేసి పెళ్లాడింది. ఈ విషయాలన్నీ స్వయంగా వర్షిణీనే బయటపెట్టింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అంతేకాకుండా ఇటీవలే గుజరాత్ నుంచి వచ్చి ఫ్యామిలీ దగ్గర ఉన్న వర్షిణీ ఇప్పుడు మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. తమను ఎవరూ విడదీయలేరని అంటోంది. తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. అఘోరీలో జెన్యుటీని చూసి ఇష్టపడ్డానని అంటోంది. అఘోరీతో సె**క్స్‌ను తాను కోరుకోలేదని.. సె**క్స్ కోరికలు తనకు లేవని తెలిపింది. ఇందులో భాగంగానే RTV ఛానెల్‌తో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అఘోరీపై ప్రేమను కురిపించింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అఘోరీ కోసం స్పెషల్ సాంగ్ 

అఘోరీ అంటే తనకు ఎంత ఇష్టం..? ఎందుకు ఇష్టమో తెలిపింది. అంతేకాదండోయ్.. అఘోరీ కోసం ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాటలను డెడికేట్ చేసింది. అఘోరీ - వర్షిణీ ఇద్దరూ కారులో ఉండి లైవ్ ఇచ్చారు. అందులో అఘోరీ కోసం వర్షిణీ కొన్ని పాటలు పాడింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ సాంగ్ పాడింది. ఆ తర్వాత.. ప్రభాస్ ‘వర్షం’ మూవీలోని మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అంటూ ఓ సాంగ్ పాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(aghori | lady aghori sri varshini relation | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment