Ram Charan : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!

మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌ తన తల్లి, భార్య కోసం చెఫ్‌ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు

New Update
Ram Charan : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!

Ram Charan As A Chef : మహిళా దినోత్సవం(Women's Day) పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌(Mega Power Star) తన తల్లి, భార్య కోసం చెఫ్‌ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో ముందు చిరంజీవి(Chiranjeevi) సతీమణి సురేఖ(Surekha) వంట గదిలో దోశలు వేస్తూ ఉంటారు. అప్పుడూ ఉపాసన.. అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్‌ లో ఏమవుతుంది? అంటూ ప్రశ్నించగా... ఏమవుతుంది.. దోశలు అవుతున్నాయంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఆ పక్కనే చరణ్‌(Ram Charan) దోశలు తిప్పుతూ కనిపించారు. నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు. దానికి ఉపాసన ఈరోజు ఉమెన్స్‌ డే కదా.. అయితే ప్రతిరోజూ ఉమెన్స్‌ డే అయితే చాలా బాగుంటుంది అంటూ నవ్వుతూ అన్నారు. తరువాత ఉపాసన చరణ్‌ గారు ఏం వండుతున్నారండీ అంటూ ఎంతో క్యూట్‌ గా చరణ్ ని అడిగితే ...దానికి సమాధానంగా చరణ్‌ మా అమ్మ కోసం పన్నీర్‌ టిక్కా(Paneer Tikka) తయారు చేస్తున్నానంటూ బదులిచ్చాడు.

ఈ సంభాషణతో ఉన్న వీడియోను ఉపాసన తన ఇన్‌ స్టాలో పోస్ట్ చేశారు. పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల లైకులను వీడియో సొంతం చేసుకుంది. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ వీడియో సొంతం అయ్యాయి. చరణ్‌ గరిటె పట్టడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా చరణ్‌ ఉపాసన కోసం ఫిష్‌ ప్రై(Fish Fry) చేసారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అటు భార్య కోసం, తల్లి కోసం ఏదైనా చేసే పర్‌ఫెక్ట్ మ్యాన్‌ అంటూ కితాబులిచ్చేస్తున్నారు. చరణ్‌ వారం రోజుల క్రితం భార్య కాళ్లకు మర్థన చేస్తున్న వీడియో కూడా ఒకటి తెగ వైరల్‌ అయ్యింది. భార్యను , తల్లిని ఇంత ప్రేమగా చూసుకుంటే ఏ అమ్మాయి అయినా చరణ్‌ లాంటి వ్యక్తినే కోరుకుంటుంది మరి.

Also Read : ఎన్నికల షెడ్యూల్ అంటూ అసత్య ప్రచారం…క్లారిటీ ఇచ్చిన ఈసీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత.

New Update

Singer Sunitha: పాడుతా తీయగా షో నిర్వాహకులు, జడ్జెస్ కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ లపై  కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆ ముగ్గురు జడ్జీ సీట్లో కూర్చొని కంటెస్టెంట్లకు అన్యాయం చేస్తున్నారని,  తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. తన కెరీర్ ని నాశనం చేశారని ఆరోపించింది. అయితే తాజాగా సింగర్ సునీత ఈ ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. వ్యక్తిత్వం అనేది పుకార్ల మీద నిర్మించబడలేదు. అలాగే వాటి వల్ల మన గౌరవం తగ్గిపోదు. ఊహాగానాల కంటే నిజమే ఎప్పుడూ గెలుస్తుందని మేము నమ్ముతాము అంటూ ఇన్ స్టాగ్రామ్ లో సంచలన వీడియో రిలీజ్ చేసింది.

నిన్నటి నుంచి రకరకాల సంస్థలు రకరకాల వార్తలు రాశారు. అలాగే ఆ అమ్మాయి కూడా పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. వారిని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఏదో చెప్పుకొచ్చింది. అందులో డైరెక్ట్ గా నా పేరు కూడా ప్రస్తావించింది కావున.. ఈ వీడియోతో క్లారిఫికేషన్ ఇస్తున్నాను అని తెలిపింది. 

ఒడిలో పెట్టుకొని పెంచాము

వీడియోలో సునీతా మాట్లాడుతూ.. ప్రవస్తి నిన్ను చిన్నప్పటి నుంచి చిత్రమ్మ, జానకమ్మ, బాలు గారు ఒడిలో పెట్టుకొని పెంచారు. అలాగే నేను కూడా నిన్ను ఒడిలో పెట్టుకొని ముద్దుచేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా.. అప్పటిలా ఒడిలో పెట్టుకొని ముద్దు చేస్తే బావుండదు కదా అని అన్నారు. నీకు గుర్తుందో లేదో.. చిన్నప్పుడు నువ్వు బాగా పాడవు అనే దానికంటే ముద్దుగా పాడవు అని అనేవాళ్ళము. చిన్నప్పుడు పాడినట్లే 19 ఏళ్ళకి కూడా మెయిన్ టైన్ చేసుంటే.. సంతోషించే మొదటి వ్యక్తిగా నేనే ఉండేదాన్ని. ఎందుకంటే.. మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా గాయత్రీ అంటూ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం కదా!  అలాంటి ప్రవస్తి ఈరోజు రోడ్డు మీదకెళ్ళి తన బాధను వెళ్లగక్కి మా గురించి చర్చించే స్థాయికి వెళ్లిందంటే నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది అని ఎమోషనల్ అయ్యింది సునీత. 

చెప్తే అంతా  చెప్పమ్మా

సునీత ఇంకా మాట్లాడుతూ.. ఎవరు బాగా పాడితే ఆ పాటలో మునిగిపోయి కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో.. ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. నువ్వు పాడుతా తీయగా మాత్రమే కాదు చాలా సింగింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నావు. మరి షో ప్రాసెస్ ఏంటో తెలీదా అమ్మా! సింగర్ సెలెక్ట్ చేసిన పాటల్లో కాపీ రైట్స్  ఆధారంగా మళ్ళీ రీ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఛానెల్ అన్ని పాటలు వాడుకోలేదు.. కావున కొన్ని మార్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ నీకు తెలుసో, తెలియదో కానీ, ఆడియన్స్ అందరికి మాత్రం అవి తెలియవు! చెప్తే అంతా  చెప్పమ్మా.. షో ప్రాసెస్, దానిలోని నిబంధనల గురించి కూడా మాట్లాడమ్మా అని ప్రవస్థికి క్లారిటీ ఇచ్చింది సునీత 

telugu-news | latest-news | cinema-news | Pravasthi About Singer Sunitha 

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment