Telangana: బజాజ్‌ షోరూంలో పేటీఎంతో రూ.4 లక్షల మోసం..

ఎస్సార్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు కొన్నారు. పేటీఎం నుంచి ఇతర వ్యక్తి ద్వారా డబ్బులు చెల్లించి మళ్లీ అతడి ఖాతాలోకే డబ్బులు మళ్లించేలా చేశారు.

New Update
Telangana: బజాజ్‌ షోరూంలో పేటీఎంతో రూ.4 లక్షల మోసం..

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆ షోరూమ్‌లో నుంచి వస్తువులు కొని.. పేటీఎం నుంచి బిల్లు చెల్లించి మళ్లీ తమ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎస్సార్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంకు గత నెలలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ. 4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, సెల్‌ఫోన్‌లు కొన్నారు. వీటికి డబ్బులు తమకు తెలిసినవారు పేటీఎంలో చెల్లిస్తారని చెప్పి.. క్యూఆర్‌ కోడ్‌ను అవతలి వ్యక్తికి పంపారు. దీంతో రాజస్థాన్‌ను నుంచి ఓ వ్యక్తి పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు.

Also read: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్

డబ్బులు షోరూమ్‌ బ్యాంకు ఖాతాలో పడ్డాకా వారు కొన్న పరికరాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్‌ నుంచి డబ్బులు చెల్లించిన వ్యక్తి ఛార్జ‌బ్యాక్‌ ఆప్షన్‌ను వినియోగించాడు. తన అకౌంట్‌లో నుంచి ఖాతా డబ్బులు తన ప్రమేయం లేకుండా షోరూమ్‌కు బదిలీ అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేశారు. చివరికి తాను చెల్లించిన డబ్బులను తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన షోరూమ్ క్యాషియర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment