Telangana: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana: తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.

ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.అలాగే,కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

సోమవారం మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, మంచిర్యాల, జయశంకర్‌, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, జిల్లాలో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డిఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడుతాయని చెప్పింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Also read: వర్షాకాలంలో వచ్చే రోగాలకు ఈ 3 కారణాలే మూలం…మరి జర భద్రం!

Advertisment
Advertisment
తాజా కథనాలు