Rains In Telangana: వాతావరణశాఖ అలర్ట్‌...ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.

New Update
Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

Rains In Telangana: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

తాజా హెచ్చరికల ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని తెలిపారు. అలాగే కుమురంభీం జిల్లా లో పిడుగుపాటుకు అంజన్న అనే యువకుడు మృతి చెందాడు.

Also Read: వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఖతమే.. కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ యాక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cancer: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బంగాళాదుంపలను సైడ్ డిష్‌, స్నాక్స్‌గా, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకుంటారు. మాంసాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

New Update

Cancer: చాలా మంది నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఇష్టపడతారు. వాళ్ళు హోటళ్ళు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అలాంటి ఆహారాలను ఆర్డర్ చేసి తింటారు. ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఇలాంటి ఆహారాలను తయారు చేసి తింటారు. అయితే ఇలా చేయొద్దని, జాగ్రత్తగా ఉండటం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల వేయించిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

అందుకే నిపుణులు కొన్నింటిని ఎక్కువగా వేడి చేయవద్దని, ముఖ్యంగా అవి నల్లగా మారే వరకు వేయించవద్దని హెచ్చరిస్తున్నారు. ఓ అధ్యయనంలో అధిక మొత్తంలో వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. మాంసాన్ని ఎక్కువసేపు వేయించడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీస్తాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఇది కూడా చదవండి: అవునా.. ఫిల్టర్ వాటర్‌ తాగితే క్యాన్సర్ వస్తుందా.. నిజమెంత?

ప్రాసెస్ చేసిన మాంసాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్‌లు అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే మాంసాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి చిప్స్ అంటే ఇష్టం. బంగాళాదుంపలను సైడ్ డిష్‌గా, స్నాక్స్ గా తీసుకుంటారు. అయితే  బంగాళదుంపలను నూనెలో ఎక్కువసేపు వేయించడం వల్ల అక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ రావచ్చు. అందుకే నిపుణులు వాటిని చిప్స్ కు బదులుగా ఉడికించి తినమని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా..?


health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment